Anagani Satya Prasad: ఏపీలో 22 ఏ భూముల సమస్య పరిష్కారానికి త్వరలో విధాన ప్రకటన: మంత్రి అనగాని.

0
137

రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడి

రీసర్వేలో రైతులను భాగస్వామ్యం చేయాలన్న మంత్రి అనగాని

22ఏ భూ సమస్యలపై రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా త్వరలో విధాన ప్రకటన చేయనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. భూసమస్యలకు పరిష్కారం చూపాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. 

 

సీసీఎల్‌ఏ కార్యాలయంలో రెవెన్యూ సమస్యలపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడారు. మంత్రివర్గ ఉప సంఘంలో 22ఏ భూములపై చర్చ జరిగిందని, ఉన్నతాధికారులు విధానం రూపొందించిన తర్వాత ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెవెన్యూ క్లినిక్‌లతో మంచి ఫలితాలు వస్తున్నాయని, వాటిని మరింత సమర్థంగా నిర్వహించాలని సూచించారు. 

 

ఫిబ్రవరి 2 నుంచి పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టాలని, వాటిలో ఎలాంటి తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. రీసర్వేలో గత తప్పులు పునరావృతం కాకుండా రైతులను భాగస్వాములుగా చేయాలని మంత్రి ఆదేశించారు. రీసర్వే గడువును 140 రోజులకు పెంచుతూ కొత్త ఎస్‌ఓపీ విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు అందుబాటులో లేకుంటే సర్వే వాయిదా వేసి, వారి సమక్షంలోనే నిర్వహించాలని సూచించారు. 

Search
Categories
Read More
Telangana
కల్లుగీత కార్మికుడి దారుణ హత్య
భరత్హ   అవాజ్ ప్రతినిధి:  హన్మకొండ  జిల్లా ఎలకతుర్తిలొ దారుణం జరిగింది. కల్లు...
By Prashanth Goindla 2026-05-14 10:11:54 0 239
SURAKSHA
Future-Ready Force: Jharkhand’s Elite Police Training
The Jharkhand Police department is actively transforming its operational capabilities through a...
By Lokeshwari Panthadi 2026-07-04 11:49:17 0 175
Andhra Pradesh
ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.
    ప్రభుత్వ పనితీరు ప్రజలకు క్షేత్రస్థాయిలో కనిపించాలి: అధికారులకు చంద్రబాబు కీలక...
By Pagadala Venkateswar 2026-04-14 07:14:54 0 153
Telangana
మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల...
By Sidhu Maroju 2026-02-08 08:25:14 0 194
Andhra Pradesh
కారు డీలర్ దౌర్జన్యం : తల్లి కొడుకు పై దాడి.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కారు డీలర్ మల్లికార్జున, తన కుటుంబ సభ్యులతో కలిసి బాకీ డబ్బులు...
By Pagadala Venkateswar 2026-03-23 05:49:03 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com