"ఖరీదైన దాహం"... వృద్ధురాలి గొలుసు లాక్కెళ్ళిన కేటుగాడు కటకటాల్లోకి..|

0
207

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అల్వాల్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితుడి నుండి బంగారం, బైక్ మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

ఘటన వివరాలు :

 

ఈనెల 10వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో వెస్ట్ వెంకటాపురానికి చెందిన 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నిందితుడు మంచినీళ్లు కావాలని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న 14 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన వృద్ధురాలికి గాయాలయ్యాయి.  

 

బాధితురాలి కుమారుడు ప్రియ చంద్రకుమార్ ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

నిందితుడి అరెస్ట్ :

 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసు బృందం, గురువారం సాయంత్రం పీజేఆర్ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పల్సర్ బైక్ పై వెళ్తున్న అల్లాడి సుభాష్ గౌడ్ (26) అనుమానస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీకి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. 

 

నిందితుడు మీర్ పేట్ లో నివసిస్తూ మొబైల్ సర్వీస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న సొత్తు:

 

నిందితుడు చోరీ చేసిన 14 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి వాడిన పల్సర్ బైక్, మరియు, మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

పోలీసుల హెచ్చరిక : 

 

ఒంటరిగా ఉండే వృద్దులు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్వాల్ ఎస్ హెచ్ ఓ. (SHO) ప్రశాంత్ సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్-100 కు సమాచారం అందించాల్సిందిగా కోరారు. 

 

త్వరితగతిన కేసును చేదించిన పోలీసుల బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Delhi - NCR
బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడు!!!!!!!!!!!
ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్స్‌ కేసులో ఈడీ దూకుడుబెట్టింగ్ ప్రమోట్‌ చేసిన సెలబ్రిటీల...
By SivaNagendra Annapareddy 2025-12-19 13:42:44 0 245
Andhra Pradesh
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై మహేష్ హెచ్చరిక
రెచ్చగొట్టే పోస్టులకు చెక్. సుండుపల్లి పోలీసులు హెచ్చరిక. సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపులో...
By Benguluri Madhubabu 2026-07-13 01:16:00 0 83
Andhra Pradesh
మదనపల్లి లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రజలు సహకరించాలి.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు మంగళవారం పోలీసులు ప్రత్యేక...
By Pagadala Venkateswar 2026-01-20 11:03:54 0 202
Business & Finance
Protect Your Rights with Legal Notice Services in India
A professionally drafted legal notice is the first step toward resolving disputes effectively....
By Navya Sree 2026-07-14 05:42:23 0 36
SURAKSHA
ఆర్థిక మోసాలలో రికవరీ: బాధితులకు తిరిగి అందిన సొమ్ము
సైబర్ ఆర్థిక మోసాలకు గురైన బాధితుల డబ్బును తిరిగి రాబట్టడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో...
By Kalaga Sailaja 2026-06-24 09:06:28 0 77
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com