"ఖరీదైన దాహం"... వృద్ధురాలి గొలుసు లాక్కెళ్ళిన కేటుగాడు కటకటాల్లోకి..|

0
47

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అల్వాల్ పోలీసులు కేవలం 48 గంటల్లోనే అరెస్టు చేశారు. నిందితుడి నుండి బంగారం, బైక్ మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.

 

ఘటన వివరాలు :

 

ఈనెల 10వ తేదీ రాత్రి 7:30 గంటల సమయంలో వెస్ట్ వెంకటాపురానికి చెందిన 70 ఏళ్ళ వృద్ధురాలు ఇంట్లో ఒంటరిగా ఉండగా.. నిందితుడు మంచినీళ్లు కావాలని అడుగుతూ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న 14 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకొని పరారయ్యాడు. ఈ క్రమంలో కింద పడిపోయిన వృద్ధురాలికి గాయాలయ్యాయి.  

 

బాధితురాలి కుమారుడు ప్రియ చంద్రకుమార్ ఫిర్యాదుతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

 

నిందితుడి అరెస్ట్ :

 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాలింపు చేపట్టిన పోలీసు బృందం, గురువారం సాయంత్రం పీజేఆర్ విగ్రహం సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పల్సర్ బైక్ పై వెళ్తున్న అల్లాడి సుభాష్ గౌడ్ (26) అనుమానస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా దోపిడీకి పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. 

 

నిందితుడు మీర్ పేట్ లో నివసిస్తూ మొబైల్ సర్వీస్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

 

స్వాధీనం చేసుకున్న సొత్తు:

 

నిందితుడు చోరీ చేసిన 14 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి వాడిన పల్సర్ బైక్, మరియు, మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

 

పోలీసుల హెచ్చరిక : 

 

ఒంటరిగా ఉండే వృద్దులు, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్వాల్ ఎస్ హెచ్ ఓ. (SHO) ప్రశాంత్ సూచించారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్-100 కు సమాచారం అందించాల్సిందిగా కోరారు. 

 

త్వరితగతిన కేసును చేదించిన పోలీసుల బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
దాతృత్వంతో మనసు గెలుచుకున్న మారాజు డాక్టర్ నరసింహమూర్తి గారు
తుమ్మలపల్లి   *25-12-2025*    *దాత్రుత్వంతో మనసు గెలుచుకున్న మారాజు...
By Rajini Kumari 2025-12-25 07:57:21 0 176
Andhra Pradesh
రాణి గారి తోట వాటర్ ట్యాంకులు త్వరలో ప్రజలకు అందజేయాలని విజ్ఞప్తి
*విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ* *17-02-2026*       *రాణి గారి తోట...
By Rajini Kumari 2026-02-17 10:42:03 0 42
Andhra Pradesh
భారతీయ జనతా పార్టీ గణతంత్ర వేడుకలు
గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారతీయజనతాపార్టీ NTR జిల్లా కార్యాలయము వద్ద జాతీయ జెండాను ఆవిస్కరించి...
By Rajini Kumari 2026-01-26 07:54:23 0 68
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com