ప్రజాస్వామ్య దేవాలయంలో విద్యార్థుల పర్యటన

0
40

*ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు: అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన*

 

అమరావతి : చట్ట సభలు ఎలా పనిచేస్తాయి? ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి? అనే అంశాలపై విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా వీక్షించారు. సుమారు 200 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి, సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా తిలకించారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరామం సమయంలో విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు అనంతరం వారితో గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ చొరవ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన ప్రదేశాలు, కూడళ్ల వద్ద పికెట్స్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి బహిరంగ ప్రదేశాలలో మద్యం...
By Gadiyapudi Narendra 2025-12-30 17:04:32 0 188
Telangana
ICICIలో గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు!
ఉద్యోగార్థులకు సువర్ణావకాశం! ICICI బ్యాంకులో సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ పోస్టుల కోసం...
By Krishna Balina 2026-02-03 08:57:44 0 58
Chandigarh
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
By Bharat Aawaz 2025-07-17 05:54:01 0 2K
Telangana
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...
By Sidhu Maroju 2026-02-06 20:23:08 0 75
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com