ప్రజాస్వామ్య దేవాలయంలో విద్యార్థుల పర్యటన

0
41

*ప్రజాస్వామ్య దేవాలయంలో భావి భారత పౌరులు: అసెంబ్లీలో విద్యార్థుల పర్యటన*

 

అమరావతి : చట్ట సభలు ఎలా పనిచేస్తాయి? ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి? అనే అంశాలపై విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా వీక్షించారు. సుమారు 200 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి, సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా తిలకించారు.

స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరియు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరామం సమయంలో విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు. ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని వారు ఆకాంక్షించారు అనంతరం వారితో గ్రూప్ ఫోటోలు దిగారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ చొరవ పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
సమ్మక్క, సారలమ్మ జాతరలో తొలి ఘట్టం మొదలైం
జాతరకు 15 రోజుల ముందు నిర్వహించే అత్యంత సంప్రదాయబద్ధమైన 'గుడిమెలిగే' (గుడి శుద్ధి) పండుగను ఈరోజు...
By Pinnehasan Odela 2026-01-14 18:15:27 0 81
Andhra Pradesh
గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన కార్యక్రమం
  గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సొసైటీ పెద్ద గుడి నందు గొప్ప అన్నదాన...
By John Baji 2025-12-30 01:44:23 0 97
Andhra Pradesh
అన్నమయ్యజిల్లా సర్వేలెన్స్ అధికారిగా డాక్టర్ శ్రీధర్ నియామకం.
అన్నమయ్య జిల్లా సర్వేలెన్స్ అధికారిగా, మదనపల్లి పీపీ యూనిట్ ఇన్‌చార్జిగా డాక్టర్...
By Pagadala Venkateswar 2026-02-06 04:21:12 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com