YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.

0
145

ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల

ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటన

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే నాయకుడే లేరని విమర్శ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారారని, బీజేపీని ఎదిరించే సత్తా ఆయనలో ఎప్పుడో చచ్చిపోయిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని అన్నారు. 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా గురువారం ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు.

 

మనుబోలు మండలం అక్కంపేటలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. తొలుత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ "రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారు" అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

 

అనంతరం కావలి మండలం ఆముదాలదిన్నెలోనూ షర్మిల పర్యటించి, ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో ప్రత్యేక పూజలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు ఆలయాలలో గురువారం తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకొని విశేష...
By Kothuru Murali 2026-03-20 06:13:05 0 154
Business & Finance
Bank Loan Rating Improves Your Business Loan Approval
A bank loan rating evaluates your business's financial strength and creditworthiness before...
By Navya Sree 2026-07-14 07:16:39 0 82
Maharashtra
Maharashtra Boosts Industrial Investment and Manufacturing
Maharashtra continues to strengthen its position as one of India’s leading industrial hubs...
By Fathima Safa 2026-06-30 11:29:18 0 51
Andhra Pradesh
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
By Mobbu Venkatramana 2026-02-06 12:21:28 0 382
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో టిడిపి ఆవిర్భావ వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను...
By Kothuru Murali 2026-03-30 11:51:12 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com