YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.

0
81

ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల

ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో పర్యటన

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని ఆరోపణ

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే నాయకుడే లేరని విమర్శ

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని వ్యాఖ్య

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో కీలుబొమ్మలా మారారని, బీజేపీని ఎదిరించే సత్తా ఆయనలో ఎప్పుడో చచ్చిపోయిందని ఏపీ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో సువర్ణాధ్యాయం మొదలవుతుందని అన్నారు. 'ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర'లో భాగంగా గురువారం ఆమె నెల్లూరు జిల్లాలో పర్యటించారు.

 

మనుబోలు మండలం అక్కంపేటలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు. తొలుత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ "రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగే ఒక్క నాయకుడు కూడా రాష్ట్రంలో లేరు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు బీజేపీకి బినామీలుగా మారారు" అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందని, పథకం పునరుద్ధరణ జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

 

అనంతరం కావలి మండలం ఆముదాలదిన్నెలోనూ షర్మిల పర్యటించి, ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అల్వాల్ సర్కిల్ ల్లో హైడ్రా దూకుడు -రూ. 10 కోట్ల విలువైన పార్కు స్థలం పరిరక్షణ.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబొల్లారం డివిజన్ లో వెలసిన గంగ ఎవెన్యూ...
By Sidhu Maroju 2025-11-27 05:21:31 0 127
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.
పుంగనూరు నియోజకవర్గంలో గత ఐదు రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 నుంచి...
By Kothuru Murali 2026-01-11 05:41:03 0 99
Bharat Aawaz
🌍 World Population Day – July 11 Why It Matters More Than Ever in 2024
Every year on July 11, the world observes World Population Day, a day dedicated to focusing...
By Bharat Aawaz 2025-06-28 05:27:05 0 1K
Andhra Pradesh
గుంటూరు వజ్రబాబు వివరణ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు చెప్పట్టే కార్యాచరణ సలహాలు మేరకు చేయడం జరుగును.
వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని...
By KOTESWARARAO KVSR 2026-02-24 13:05:05 0 258
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com