చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు

0
155

బాపట్ల జిల్లా:  చిన్నగంజాం మండలం సోపిరాల, కొత్తపాలెం గ్రామలలో దేవాలయాలను  సందర్శించిన జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు. సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తూ శివరాత్రి ఉత్సవాలను సమర్ధవంతంగా నిర్వహించాలి. ఏటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నాం. భక్తులు రైల్వే ట్రాక్ దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆలయాల పరిసర ప్రాంతాలలో డ్రోన్లు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నాం.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగను జరుపుకోవాలి జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపిఎస్ గారు

ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని, బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం సోపిరాలలోని రామకోటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపాలెం గ్రామ పంచాయతీలోని బాల కోటేశ్వర స్వామి దేవాలయాలను గురువారం జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. రెండు ఆలయ కమిటీల సభ్యులు జిల్లా ఎస్పీ గారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాల పరిసర ప్రాంతాలను, క్యూలైన్ల ఏర్పాటును, సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలను మరియు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసే స్థలాలను ఎస్పీ గారు స్వయంగా పరిశీలించారు. అనంతరం రెండు ఆలయ కమిటీల ప్రతినిధులతో, సంబంధిత శాఖల అధికారులతో స్థానిక శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో ఎస్పీ గారు సమన్వయ సమావేశం నిర్వహించి, మహాశివరాత్రి తిరునాళ్లు విజయవంతంగా జరిగేలా అధికారులకు తగిన సూచనలు చేశారు.

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రసిద్ధి గాంచిన ఈ దేవాలయాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, దేవాదాయ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, జి.ఆర్.పి (GRP), ఆర్.పి.ఎఫ్ (RPF), ఆలయ కమిటీలతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గత ఏడాది మహాశివరాత్రి రోజున సుమారు 30 వేల మందికి పైగా భక్తులు వచ్చినట్లు అంచనాలు ఉన్నాయని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూ లైన్లు, బ్యారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో వృద్ధులకు, చిన్న పిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా రెండు ఆలయాలకు వచ్చే భక్తులలో 80 శాతం మంది రైల్వే ట్రాక్‌లు దాటుకుని వస్తున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ఎస్పీ గారు హెచ్చరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జి.ఆర్.పి, ఆర్.పి.ఎఫ్ అధికారుల సమన్వయంతో తగినంత మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు చెప్పారు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తామని, భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎవరైనా తప్పిపోయిన పక్షంలో అనౌన్సింగ్ ద్వారా వారిని గుర్తించే ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

నేరాలు జరగకుండా నిరోధించేందుకు మఫ్టీలో కూడా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని, మహిళా భక్తులు తమ ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భక్తులందరూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగను జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. 

ఈ కార్యక్రమంలో చీరాల ఆర్.డి.ఓ చంద్రశేఖర నాయుడు, డి.ఎస్.పి మోయిన్, ఎస్.బి ఇన్స్‌పెక్టర్ నారాయణ, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రమణయ్య, ఆలయ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు ఆలయ కార్యవర్గ చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్.
77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి కలెక్టరేట్లో జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-26 11:31:05 0 147
Andhra Pradesh
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు మంగళసూత్రాలు విరాళం బహుమతి అందజేత
ప్రకటన  ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి బంగారు సూత్రాలు విరాళం  ...
By Rajini Kumari 2026-03-14 11:41:59 0 168
Tamilnadu
హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|
హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై...
By Sidhu Maroju 2025-11-28 06:27:32 0 171
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ ల పొట్ట కొట్టింది.: ఎమ్మెల్యే తలసాని.|
సికింద్రాబాద్ :  తెలంగాణ వ్యాప్తంగా ఆటోడ్రైవర్ల జీవనం అగమ్య గోచరంగా మారిందని మాజీ...
By Sidhu Maroju 2025-10-27 08:09:50 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com