ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,

0
163

చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ పేర్కొన్నారు.

గురువారం చెరుకు పల్లిమండలం ఆరుంబాకపంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు రెడ్ క్రాస్ సంస్థ  ఆధ్వర్యంలో  నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని గిరిజనులకు నిత్యావసర వస్తువులను కలెక్టర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో ఎన్ని యానాది కుటుంబాలు ఉన్నాయని, అందులో ఎంత మందికి ఆధార్,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు ఉన్నాయా లేవాని పూర్తి సర్వే చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిని ఆదేశించారు. మండలాల వారిగా యానాది కుటుంబాలు ఎంత మందికి ఆధార్ కార్డు లేదు,ఎంత మందికి రేషన్ కార్డు, ఎంత మందికి ఇంటి స్థలాలు ఉన్నాయా లేవని సర్వే చేయాలన్నారు. ముఖ్యంగా ఆధార్ కార్డు ఉంటేనే రేషన్ కార్డు వస్తుందని తెలిపారు. ఎంత మందికి ఆధార్  లేదన్న జాబితా తయ్యారు చేసి ఆధార్ క్యాంపు లు పెట్టి ఆధార్ కార్డులు   తీయించుటకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారిణి ఆదేశించారు.

బాపట్ల జిల్లా లోని నిరుపేదలైన యానాది కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా  నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా  ఆరుంబాక పంచాయతీ,కమినేనివారి పాలెం గిరిజన కాలని నందు
10 యానాది  కుటుంబాలకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యవసర సరుకులు, దుస్తులు, ఒక బస్తా బియ్యం, కూరగాయలు, కిచెన్ కిట్లు, దుప్పట్లు, రగ్గులు, టార్పాలిన్ పట్టలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీఓ యన్.రామలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారత అధికారి అబ్భులు,తహశీల్దార్ సిహెచ్ పద్మావతి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ప్రతినిధులు నారాయణ భట్టు,  పంచాయతీ సెక్రటరీ, వి ఆర్ ఓ , యానాది కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

 

#Narendra

Search
Categories
Read More
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 199
Andhra Pradesh
శ్రీకాకుళం: 5వ R&B మినిస్టర్ ర్యాంక్
రాష్ట్ర రహదారులు, భవనాల (R&B) శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ నెల 5, 6 తేదీల్లో శ్రీకాకుళం...
By Manda Ramkumar 2026-04-03 05:53:54 0 52
Sports
భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా
టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు...
By Benguluri Madhubabu 2026-02-26 10:37:19 0 143
Telangana
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాహక సమావేశం
ముదిరాజ్ సమన్వయ కమిటీ సన్నాక సమావేశం హైదరాబాదులో ముదిరాజ్ ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్...
By MERIGE MALLESH 2026-04-01 13:04:54 0 131
Andhra Pradesh
కర్నూలు జిల్లా నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి
నాగలాపురం పోలీస్ స్టేషన్ పెద్దపాడు సమీపంలో ఫిట్స్ తో గుర్తు తెలియని వ్యక్తి మృతి పెదపాడు దగ్గర...
By mahaboob basha 2025-06-09 05:19:41 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com