ఉపవాస దీక్షలు రంజాన్ అనంతరం సముద్రతీరాలకు ముస్లింల రాక

0
92

చీరాల: చీరాలలో రంజాన్ పండగ ముగిసిన మరుసటి రోజు ముస్లింలు 30 రోజుల ఉపవాస దీక్షల అనంతరం విశ్రాంతి, ఆనందాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సమేతంగా సముద్ర తీర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. చిన్నలు, పెద్దలు కలిసి సముద్ర స్నానాలు చేస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు.
ఇది ఆచార పరమైన కార్యక్రమం కాకపోయినా, రంజాన్ సందర్భంగా దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఒకేచోట చేరుతారు. పండగ అనంతరం కూడా కలిసి గడపాలనే ఉద్దేశంతో సముద్రతీరాలకు వెళ్లి ఆనందాన్ని పంచుకుంటున్నారు.
ప్రత్యేకంగా చీరాల ప్రాంతంలోని సముద్ర తీరాలు అయిన రామాపురం,ప్రాంతాలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లోని సహజ సౌందర్యం, చల్లని గాలి సందర్శకులకు మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
గుంటూరు, నరసరావుపేట, చిలకలూరిపేట, పర్చూరు తదితర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు చీరాల సముద్రతీరానికి తరలివచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపి వెళ్తారు.

 

#Narendra

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ మోడల్ స్కూల్ 6వ తరగతి ప్రవేశాలకు ఆహ్వానం
కవిటి మండలం:ఎపి మోడల్ స్కూల్ సోంపేటలో 2026-27 విద్యా సంవత్సరం 6వ తరగతి ప్రవేశనికి విద్యార్థి...
By Jeeru Kumar 2026-02-25 08:56:11 0 297
Telangana
కాట్రియాలలో ఉత్సాహంగా గ్రామసభ
రామాయంపేటలోని కాట్రియాలలో '99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక' గ్రామసభ గురువారం సర్పంచ్ కొత్త...
By Katiyala JeevanRaj 2026-04-02 10:53:07 0 67
Telangana
అర్హులైన పేదలందరికీ న్యాయం చేస్తాం: తుమ్మల నాగేశ్వరరావు...
వెలుగుమట్ల భూముల వ్యవహారంలో అర్హులైన పేదలెవరైనా సరే, వారికి ఖచ్చితంగా న్యాయం చేయాలని మంత్రి...
By Krishna Balina 2026-03-28 14:30:17 0 80
Telangana
BRS మండల నాయకులను పరామర్శించిన కేటీఆర్
ఖమ్మం జిల్లా BRS కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల...
By Krishna Balina 2026-01-08 09:25:04 0 170
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం
సదుం గ్రామానికి చెందిన ఆసిఫ్, డ్రైవింగ్ లైసెన్స్ కోసం పుంగనూరు ఆర్డీవో కార్యాలయానికి ద్విచక్ర...
By Kothuru Murali 2026-03-13 08:54:32 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com