Chintakayala Ayyanna Patrudu: ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి కొత్త టెక్నాలజీ... సీట్లో కూర్చుంటేనే ఆటెండెన్స్!
Andhra
Chintakayala Ayyanna Patrudu Announces New AI Attendance System in AP Assembly
ఏపీ అసెంబ్లీలో నేటి నుంచి ఏఐ ఆధారిత హాజరు విధానం.
సభ్యులు తమ సీట్లలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదు
కొత్త విధానాన్ని అధికారికంగా ప్రకటించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం సిద్ధమవుతుందని వెల్లడి
వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం నుంచి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇకపై సభ్యులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటేనే వారి హాజరు నమోదవుతుంది. ఈ మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం వెల్లడించారు. ఈ బడ్జెట్ సమావేశాల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు, ఇప్పటివరకు రిజిస్టర్లో సంతకాల ద్వారా హాజరు నమోదు చేసే పద్ధతికి స్వస్తి పలుకుతున్నట్లు తెలిపారు. నూతన ఏఐ విధానం ద్వారా సభ్యుల హాజరును మరింత కచ్చితంగా, పారదర్శకంగా నమోదు చేసేందుకు వీలు కలుగుతుందని వివరించారు. పెద్ద కార్పొరేట్ సంస్థల సీఈఓలు సైతం బయోమెట్రిక్ విధానాన్ని వాడుతున్నారని, పార్లమెంట్లోనూ ఇలాంటి టెక్నాలజీని తీసుకురావాలని యోచిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
ఈ సందర్భంగా, బడ్జెట్ సమావేశాల తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి హాజరై వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల గురించి స్పీకర్ సరదాగా ప్రస్తావించారు. "11వ తేదీన 11 మంది వచ్చి 11 నిమిషాలు ఉండి వెళ్లిపోయారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
అలాగే, 2028 డిసెంబర్ నాటికి అమరావతిలో దేశంలోనే అత్యుత్తమమైన కొత్త అసెంబ్లీ భవనం సిద్ధమవుతుందని స్పీకర్ తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, 300 మందికి పైగా సభ్యులు కూర్చునేలా దీనిని నిర్మిస్తామని ఆయన వివరించారు. ఈ కొత్త విధానంతో సభా కార్యకలాపాల్లో సభ్యుల భాగస్వామ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz