నూతన అధ్యక్షులకు పూలదండతో సత్కరిస్తున్న కమిటీ సభ్యులు బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరి.

0
143

బాపట్ల: బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా అంకమ్మ చౌదరిని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సలహాదారులు గంట అంజిబాబు తెలిపారు. స్థానిక బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారంక్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల క్రికెటర్ అసోసియేషన్ గత పాలకవర్గ కమిటీ కాలపరిమితి ముగిసినందున నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతన కమిటీలో ప్రెసిడెంట్ ఎర్ర అంకమ్మ చౌదరి, వైస్ ప్రెసిడెంట్ బీ.జేరామ్ రెడ్డి ,సెక్రటరీ బిల్లా స్టాండ్లీ విమల్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఎలవల నరేష్ ,ట్రెజరర్ అబ్దుల్ కరీం అదేవిధంగా బాపట్ల క్రికెట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షులుగా బందా బాబు, సిహెచ్ రోశయ్యలో తో పాటు సభ్యులుగా పఠాన్ రాజేష్, ఎం శ్రీనివాసరావు ,కొట్ర వెంకటరావు, కొమరోలు శ్రీనివాసరావుని కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అనంతరం ప్రెసిడెంట్ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ బాపట్ల క్రికెట్ అసోసియేషన్ బలోపేతనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు బాపట్ల జిల్లాలో యువ క్రికెట్ క్రీడాకారుల అభివృద్ధికి కమిటీ సభ్యులందరూ తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గత కమిటీ ఆధ్వర్యంలో యువ క్రీడాకారుల కోసం నెట్స్ ప్రాక్టీస్ నిమిత్తం గ్రౌండ్ కేటాయించడం జరిగిందన్నారు. యువ క్రీడాకారుల కోసం నెక్స్ట్ ప్రాక్టీస్ చేసేందుకు స్థలాన్ని కేటాయించిన బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ, ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ,కలెక్టర్ వినోద్ కుమార్ లకు మా నూతన కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. నూతనంగా ఎంపికైన బాపట్ల క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు ప్రజా ప్రతినిధులు,సీనియర్ క్రికెట్ క్రీడాకారుల సలహాలు, సహకారాలు, అందించాలని ఆయన కోరారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
"మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల...
By Sidhu Maroju 2026-05-15 14:15:23 0 88
Telangana
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
By Pinnehasan Odela 2026-01-14 18:42:55 0 194
Andhra Pradesh
అమెరికాలో బొబ్బిలి మండల వాసి మృతి
బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన సింగిరెడ్డి సాయి శ్రీ హరికృష్ణ (26) అమెరికాలో మృతి...
By Boiena Rajesh 2026-04-12 12:57:47 0 110
Punjab
Ludhiana’s Green Leap: India’s First Hydrogen-Bus Fleet
Ludhiana officially became the first city in North India to transition its entire public transit...
By Dunna Jessicaruth 2026-05-14 08:21:29 0 34
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com