డాక్టర్ ఎన్టీఆర్ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకంలో భాగంగా ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్

0
141

బాపట్ల జిల్లా:  కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ క్యాంపు జరుగుతుంది . ఈ ప్రత్యేక శిబిరాన్ని అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి స్మిత్ కొత్తపాలెం పంచాయతీ సర్పంచ్ పాలపర్తి సంపూర్ణమ్మ మరియు చెరుకూరి పంచాయతీ సర్పంచ్ పాలేటి వీరయ్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వ్యవసాయ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సర విద్యార్థులుతో ఒక వారం పాటు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తామని ఈ సంవత్సరం ఈ గ్రామాలలో ఏంచుకొని ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రామాలలో వారం రోజులపాటు నిర్వహించే వివిధ కార్యక్రమాలను వివరించారు. ప్రతి విద్యార్థి సేవాతప్రత అలవర్చుకోవాలని విద్యార్థులు అందరూ కూడా ఈ వారం రోజులు గ్రామ ప్రజలు రైతులతో కలివిడిగా ఉంటూ వారి వ్యవసాయ అనుబంధ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి తగిన సూచనలు కళాశాల అధ్యాపకులను అడిగి రైతులకు చెప్పాలన్నారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి పాలపర్తి సంపూర్ణమ్మ గారు పాలేటి వీరయ్య గారు మా గ్రామాలను ఎంచుకోవటం చాలా సంతోషకరమని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గ్రామాల్లో స్థితిగతులను తెలుసుకొని మాక్కూడా తెలియజేయాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామస్తులు శ్రీ కల్లం సింగారెడ్డి గారు శ్రీ కుసుమం వెంకట రెడ్డి గారు కళాశాల సిబ్బంది డాక్టర్ జి రవిబాబు డాక్టర్ కల్లం వెంకట సుబ్బరామిరెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ డి విజయ్ కుమార్ డాక్టర్ ఎన్ అశోక్ కుమార్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రసాద్ శుక్లా.|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమితులయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్...
By Sidhu Maroju 2026-03-05 19:03:02 0 153
Andhra Pradesh
Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు.
Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు 03-02-2026...
By Pagadala Venkateswar 2026-02-04 07:54:05 0 124
Andhra Pradesh
జీడి మామిడి తోటల్లో ఏనుగుల సంచారం
గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లోని జీడి మామిడి తోటల్లో మంగళవారం ఉదయం ఏనుగుల...
By Boiena Rajesh 2026-04-28 03:03:43 0 146
Andhra Pradesh
వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:34:41 0 1K
Andhra Pradesh
పుంగనూరు:ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు...
By Kothuru Murali 2026-03-14 08:30:58 0 114
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com