అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.

0
105

 

అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

18-04-2026 Sat 07:23 | Andhra

Sajjala Bhargav Reddy Case High Court Outraged by Defamatory Posts

వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం

అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు

సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న

షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం

నిందితులపై దర్యాప్తు చేసి శిక్షపడేలా చూడాలని పోలీసులకు ఆదేశం

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి వ్యవహారంలో ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రుల కుటుంబ సభ్యుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని 'ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన'గా అభివర్ణించింది. ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది.

 

తనపై జారీ చేసిన లుక్అవుట్ సర్క్యులర్ (ఎల్‌ఓసీ)ను రద్దు చేయాలని కోరుతూ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పిటిషనర్ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని ధర్మాసనం గుర్తు చేసింది.

 

ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. అదే సమయంలో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని భార్గవ్ రెడ్డిని ఆదేశించింది. అవసరమైనప్పుడు విచారణకు హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.

 

ఈ షరతులకు లోబడి భార్గవ్ రెడ్డిపై ఉన్న ఎల్‌ఓసీని రీకాల్ చేయాలని అన్నమయ్య జిల్లా ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమకు అభ్యర్థన అందిన వెంటనే ఎల్‌ఓసీని రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కూడా ఆదేశిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల గొడవ: చెప్పుతో దాడి కలకలం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాత్రి పారిశుద్ధ్య కార్మికుల మధ్య వర్గ విభేదాలు...
By Pagadala Venkateswar 2026-03-05 03:50:15 0 136
Andhra Pradesh
ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
*ఫిబ్రవరి 12న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి*   *సమ్మెకు సన్నాహంగా గురువారం నాడు...
By Rajini Kumari 2026-02-06 09:32:31 0 152
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు
చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన...
By Kothuru Murali 2026-04-07 05:46:27 0 179
SURAKSHA
విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీసులు
 భవిష్యత్ తరాలైన విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తెలంగాణ పోలీసులు...
By Kalaga Sailaja 2026-06-30 09:02:06 0 56
Andhra Pradesh
వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...
చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక...
By Gadiyapudi Narendra 2026-03-03 17:29:30 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com