కాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు - వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|

0
54

సికింద్రాబాద్.. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ ముఠాను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుల నుండి ఐదు గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన సుభాష్ నాథ్,కరణ్ నాథ్, సోహాన్ నాథ్ లు జీవనోపాధి కోసం హైదరాబాద్ పహాడ్ షరీఫ్ లో నివాసం ఉంటున్నారు. దృష్టిమరించి దొంగతనాలు చేయాలని పక్కా ప్రణాళిక తో కాషాయ వస్త్రధారణ లో స్వామీజీలుగా నమ్మబలుకుతూ లలిత నగర్ లో వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

మంచినీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లి వారికి మాయ మాటలు చెప్పి శాంతి పూజలు చేస్తామని నమ్మించారు. శాంతి పూజలు ఉంగరాన్ని ఉంచాలని చెప్పి తీసుకుని నోట్లో మింగేసి అక్కడినుండి ఆటోలో పరారయ్యారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను జల్ పల్లిలో గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మున్సిపల్‌ సమావేశంలో YCP కౌన్సిలర్ల నిరసన.
మదనపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాలులో గురువారం జరిగిన సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు ఛైర్మన్ పోడియం...
By Pagadala Venkateswar 2026-01-23 07:30:08 0 57
Andhra Pradesh
ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి విశేషంగా అభిషేకములు
ఈరోజు రాయచోటి శ్రీ లింగేశ్వర శ్రీ శనీశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ దక్షిణామూర్తి స్వామి వారికి...
By Benguluri Madhubabu 2026-01-15 04:46:24 0 218
Andhra Pradesh
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ ప్రయోజనాలు
యోగ అభ్యసనం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం... యోగ,  క్రీడల ద్వారా విద్యార్థులకు బహుళ...
By Gadiyapudi Narendra 2025-12-27 16:07:15 0 247
Andhra Pradesh
కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడితే చర్యలు : కమిషనర్
కర్నూలు : కర్నూలు జిల్లా  కార్పొరేషన్ ఆదాయానికి గండి పడితే సహించను• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-07 12:33:04 0 70
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com