Nara Lokesh: విద్యార్థులకు శుభవార్త చెప్పిన మంత్రి నారా లోకేశ్.

0
151

ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 1,200 కోట్లను విడుదల చేసినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ప్రకటించారు. తాజాగా బ్యాంకు విడుదల ఉత్తర్వుల (BROs) ద్వారా ఈ నిధులను తక్షణమే విడుదల చేస్తున్నామని, దీనివల్ల విద్యార్థులకు వెంటనే లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు.

 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మా హామీ ఒక్కటే. ఇకపై చదువులకు ఎవరికీ ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు. పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించి, భవిష్యత్తులో సకాలంలో సాయం అందించడమే మా ప్రభుత్వ స్పష్టమైన నిబద్ధత," అని వివరించారు.

 

ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. "మీ ప్రభుత్వం మీకు తోడుగా ఉంది, మీరంతా ధైర్యంగా చదువుకోండి" అని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ నిధుల విడుదలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Search
Categories
Read More
Telangana
ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.|
   హైదరాబాద్ :  రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు,...
By Sidhu Maroju 2025-12-29 18:05:02 0 189
Telangana
140 వ మే డే వేడుకల్లో పాల్గొన్న ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ మేడే వేడుకల్లో...
By Avunoori Mahesh 2026-05-01 10:09:59 0 201
Andhra Pradesh
పుంగనూరు: హెడ్ కానిస్టేబుల్ గిరిబాబు మృతి
సదుం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న గిరిబాబు (48) అనారోగ్యంతో శనివారం...
By Kothuru Murali 2026-04-26 10:45:51 0 90
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 201
Telangana
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ -2025 ప్రకటన.|
  హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం...
By Sidhu Maroju 2026-03-07 09:25:12 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com