రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు,ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి,సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ .

0
439

రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం పనివేళల ముగింపు కంటే ఒక గంట సమయం ముందుగానే ప్రార్థనల నిమిత్తం బయటకు వెళ్లేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మంగళవారం అమరావతిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 

ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ముస్లిం ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖల విభాగ అధిపతులకు, జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా మార్గదర్శకాలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు.

 అత్యవసర పరిస్థితులలో తప్ప, రంజాన్ మాసంలో ఒక గంట ముందుగా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ముస్లిం ఉద్యోగులు మతపరమైన ఆచారాలు నిర్వహించుకోవడానికి బయటకు వెళ్లేందుకు అనుమతించే నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి ఫరూక్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ వారి భక్తులు కు అలెర్ట్ ఈ రోజు అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార దర్శనాల ఆ టోకెన్లు రద్దు
తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ అర్ధరాత్రి నుంచే వైకుంఠద్వార...
By Karapati Gopi 2025-12-29 05:58:14 0 315
SURAKSHA
Nandini Maharaj, IAS: A Rising Leader in Public Service
A dynamic 2019-batch AGMUT cadre IAS officer known for citizen-centric governance, women and...
By Lokeshwari Panthadi 2026-07-18 07:07:17 0 49
Andhra Pradesh
దేశ భవిష్యత్తు నిర్ణయంలో యువత పాత్ర కీలకం.
అన్నమయ్య జిల్లా జేసీ శివ నారాయణ శర్మ ఆదివారం మదనపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-01-25 12:44:26 0 183
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:33:59 0 37
Telangana
క్రైస్తవ ఉజ్జీవ సభల పోస్టర్ ఆవిష్కరణ
 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కంటోన్మెంట్!   ఈనెల 24,25,26 తేదీలలో మడ్ ఫోర్డ్...
By Sidhu Maroju 2025-10-17 13:38:02 0 289
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com