Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.

0
286

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. 

 

సిట్ నివేదిక ప్రకారం కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో పలు నగరాలకు మళ్లించారు. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్ వర్క్ ల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయి. సుమారు రూ. 234.5 కోట్లకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలైన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది
*సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటనను రద్దు చేసింది* -శ్రీపర్ణ చక్రవర్తి   న్యూఢిల్లీ: కేంద్ర...
By Rajini Kumari 2025-12-19 11:18:10 0 220
Telangana
రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం...
By Mahankali Ravi 2026-07-23 15:31:23 0 28
Andhra Pradesh
గుంటూరులో న్యాయ- పోలీసు సమన్వయ నేర సమీక్ష సమావేశం జరిగినది.
    >కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   గుంటూరులో న్యాయ–పోలీసు...
By KOTESWARARAO KVSR 2026-01-10 13:25:27 0 636
Telangana
BRS హయంలో నగర అబి వృద్ధి.
బిర్ ఎస్ హయంలో నగరo అన్నీరాగలో అభి వృద్ధి  చెందిoదని  మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా...
By Sadaq Sadaq 2026-02-04 15:41:09 0 217
Andhra Pradesh
రైతులకు ‘అన్నదాత సుఖీభవ’, పీఎం కిసాన్ నిధుల విడుదల.
అన్నమయ్య జిల్లాలో 1,88,408 మంది రైతులకు మూడో విడత అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కింద రూ. 108.37...
By Pagadala Venkateswar 2026-03-13 07:12:58 0 169
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com