Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.

0
196

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. 

 

సిట్ నివేదిక ప్రకారం కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో పలు నగరాలకు మళ్లించారు. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్ వర్క్ ల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయి. సుమారు రూ. 234.5 కోట్లకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలైన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో అక్రమ దోపిడిని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-13 12:54:23 0 121
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 70
Andhra Pradesh
శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు నంబరు పూలు కుంటలోని తిమ్మమ్మ మర్రిమాను దగ్గర శ్రీకృష్ణదేవరాయలు విగ్రహావిష్కరణలు పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-02-07 08:43:01 0 238
Telangana
నిజామాబాద్: నగరంలో ప్రారంభం అయినాదహనం
. ఇందిరా ప్రియదర్శిని.  కలోనిలో హోలీ పండగను పురస్కరించుకుని సోమవారము రాత్రి 7గంటలనుండి కమధన...
By Sadaq Sadaq 2026-03-02 17:18:22 0 215
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com