Tirumala Laddu: తిరుమల కల్తీ లడ్డూ కేసులో కీలక మలుపు.. రూ. 234 కోట్ల హవాలా.. రంగంలోకి దిగిన ఈడీ.

0
130

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సీబీఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. 

 

సిట్ నివేదిక ప్రకారం కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో పలు నగరాలకు మళ్లించారు. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్ వర్క్ ల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయి. సుమారు రూ. 234.5 కోట్లకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలైన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Ladakh
Ladakh High Court Refuses Bail in Narco‑Terrorism Juvenile Case
On July 16, 2025, the Jammu & Kashmir & Ladakh High Court denied bail to a juvenile...
By Bharat Aawaz 2025-07-17 06:29:24 0 988
Andhra Pradesh
శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు - కేసు డైరీలు రికార్డుల క్షుణ్ణ పరిశీలన!
శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యం: యర్రగొండపాలెం సీఐ గారు ఆకస్మిక తనిఖీలు – కేసు డైరీలు,...
By Chennaiah Kati 2026-01-31 14:29:43 0 191
Telangana
సింగరేణి టెండర్ల సెగ.. పాలేరు మాజీ MLA
పాలేరు మాజీ MLA కందాల ఉపేందర్ రెడ్డి విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సింగరేణి బొగ్గు...
By Krishna Balina 2026-02-02 09:16:41 0 147
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com