లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు

0
148

చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న జరగనున్న జాతీయ కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ బాపట్ల జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి నెలకు రూ.26,000 వేతనం ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గత ఇరవై సంవత్సరాలుగా పేద ప్రజలకు నిరంతరం ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి వారిని కార్మికులుగా ప్రకటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆశా సమస్యల పరిష్కారానికి కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లాలోని ఆశా వర్కర్స్ అందరూ ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు.

ఈ సందర్భంగా మరియంపేట పీహెచ్సీ డాక్టర్ జి. శిరీషకు సమ్మె నోటీసు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. వసంతరావు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు శీలమ్మ, వి. ఆశాజ్యోతి, ఎం. దీనమ్మ తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పరుగులు పెడుతున్న డోన్ నియోజకవర్గ అభివృద్ధి పనులు :
కర్నూలు :  డోన్ డోన్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది....
By Hari Krishna 2026-01-05 06:09:36 0 187
Andhra Pradesh
గద్దె అనురాధ చిట్టిబాబులకు ఎంపీ కేసినేని శివనాథ్ శుభాకాంక్షలు
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   గ‌ద్దె అనురాధ, చెన్నుబోయిన చిట్టిబాబుల కు...
By Rajini Kumari 2025-12-22 08:23:36 0 195
Andhra Pradesh
మదనపల్లి: పసిపాప మృతదేహం కలకలం.
మదనపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది. రామసముద్రం మండలం ఎలకపల్లి సమీపంలోని చెరువు వద్ద గుర్తు...
By Pagadala Venkateswar 2026-04-30 04:22:19 0 62
Telangana
రాజీవ్ గృహకల్పలో విద్యుత్ సెగ- మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కాలనీవాసులు.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  :  కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్...
By Sidhu Maroju 2025-12-29 16:04:15 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com