వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్

0
191

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై విజయ్ కుమార్ సోమవారం గడియార స్తంభం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

 

 ఈ తనిఖీలలో భాగంగా, వాహనదారుల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.

 

 ఈ సందర్భంగా బాపట్ల పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాణాలకు రక్షణ కల్పిస్తాయని గుర్తుచేశారు. ముఖ్యంగా, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ నిర్వహించే ఈ తనిఖీలు వాహనదారులను ఇబ్బంది పెట్టడం కోసం కాదని, ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని ఎస్ఐ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

 

#Narwndra

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఇజ్రాయెల్ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ.
ఇజ్రాయెల్ వాణిజ్య, పరిశ్రమల మంత్రితో చంద్రబాబు సమావేశం సాంకేతిక సహకారం అందించాలని కోరిన...
By Pagadala Venkateswar 2026-01-21 14:44:30 0 164
Andhra Pradesh
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని...
By Boiena Rajesh 2026-05-27 14:00:46 0 192
Telangana
నిజాంపేట x రోడ్ నుండి గాగిలాపూర్×రోడ్ వరకు ‎మియాపూర్ ×నుండీ మజిద్పూర్ (కరీంనగర్ హైవే )‎రూట్ లో  ఆర్ టి సి బస్సులు నడపండి
  ‎హైదరాబాదు నగరంలో  సిటీ శివారు ప్రాంతాలైనా బాచుపల్లి, మల్లంపేట, ఖాజీపల్లి లో...
By Ponnala Srinivasrao 2026-03-02 10:55:38 0 522
Telangana
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకు దక్కిన అరుదైన గౌరవం
   హైదరాబాద్: అత్యుత్తమ పనితీరును గుర్తించి డీఐ వెంకటేశ్వర్లు కు బంగారు పతకంతో...
By Sidhu Maroju 2025-08-22 14:32:17 0 590
Andhra Pradesh
అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం.
  అధ్యాపక పోస్టుల భర్తీ వేగవంతం చేయండి: అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం   Andhra...
By Pagadala Venkateswar 2026-06-26 05:17:17 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com