వాహనాల తనిఖీ చేసిన పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్

0
190

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై విజయ్ కుమార్ సోమవారం గడియార స్తంభం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.

 

 ఈ తనిఖీలలో భాగంగా, వాహనదారుల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.

 

 ఈ సందర్భంగా బాపట్ల పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాణాలకు రక్షణ కల్పిస్తాయని గుర్తుచేశారు. ముఖ్యంగా, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ నిర్వహించే ఈ తనిఖీలు వాహనదారులను ఇబ్బంది పెట్టడం కోసం కాదని, ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని ఎస్ఐ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.

 

#Narwndra

Search
Categories
Read More
Andhra Pradesh
నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు.
  నిప్పులకొలిమిలా ఆంధ్రప్రదేశ్... తూర్పుగోదావరిలో 48.3 డిగ్రీలతో సీజన్ రికార్డు Andhra...
By Pagadala Venkateswar 2026-05-25 04:44:04 0 87
Andhra Pradesh
జోరుగా హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ 4 పోటీలు
*జోరుగా.. హుషారుగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ -4 పోటీలు*   *3వ రోజు 10 జట్ల మధ్య 5...
By Rajini Kumari 2025-12-24 08:08:18 0 195
Andhra Pradesh
పుంగనూరు: మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా...
By Kothuru Murali 2026-06-03 15:07:34 0 79
Andhra Pradesh
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు ....
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి 25 కంప్యూటర్లతో ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉప ముఖ్యమంత్రి...
By SivaNagendra Annapareddy 2025-12-15 15:01:08 0 277
Telangana
ప్రేమ వ్యవహారం మలుపు తిరిగి హత్య.. మారేడుపల్లి పోలీసుల మెరుపు దర్యాప్తు.|
సికింద్రాబాద్ : మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన శ్రవణ్ హత్య కేసును పోలీసులు...
By Sidhu Maroju 2026-06-03 07:08:09 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com