Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.

0
167

అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతోందో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటం ఇంజనీర్లు, అడ్వాన్స్‌డ్ ఏఐ నిపుణులు, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చిప్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ ఎక్స్‌పర్టులు, ఆర్‌ఎఫ్ ఇంజనీర్లతో పాటు డీప్ టెక్ పరిశోధకులకు భారీ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదని, అవి 'ఫ్యూచర్ ప్రూఫ్' ఉద్యోగాలని ఆయన నొక్కి చెప్పారు.

 

అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే పరిమితం కాదని, ఇది సైన్స్, కంప్యూటేషన్, ఇన్నోవేషన్ రాజధానిగా రూపాంతరం చెందబోతోందని లోకేశ్ ప్రకటించారు. "మన యువత అత్యాధునిక సాంకేతికతను కేవలం ఉపయోగించే వారుగా కాకుండా, దానిని సృష్టించే నిర్మాతలుగా మారాలన్నదే మా లక్ష్యం. క్వాంటం, డీప్ టెక్, ఏఐ వంటివి అమరావతి కొత్త గుర్తింపును నిర్వచిస్తాయి. ఇది ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించే నగరంగా, అత్యాధునిక టెక్నాలజీని ప్రపంచానికి ఎగుమతి చేసే కేంద్రంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

ఒకప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ విప్లవానికి ఎలా నాయకత్వం వహించిందో, ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి భారతదేశ క్వాంటం విప్లవానికి నేతృత్వం వహించబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి 14 ప్రఖ్యాత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ఇండస్ట్రీ, అకాడెమియా, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో తదుపరి సాంకేతిక శకానికి ఏపీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

 

భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటవుతోందని లోకేశ్ తెలిపారు. సూపర్‌ కండక్టింగ్, ఫోటానిక్, ఐయాన్ ట్రాప్ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌లు ఇక్కడ అభివృద్ధి కానున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు ఈ నూతన సాంకేతికతలపై శిక్షణ పొందుతున్నారని, దీర్ఘకాలంలో 10 లక్షల మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఐబీఎం, టీసీఎస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, క్యూపీఏఐ వంటి సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దిగ్గజ సంస్థల రాక, ప్రపంచ స్థాయి పరిశ్రమలు అమరావతిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మేత వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో మంత్రి లోకేష్ భేటీ
*Ln Davos tour - Day – 3*   *21-1-2026*   *Press Release – 4*  ...
By Rajini Kumari 2026-01-21 15:04:02 0 172
Andhra Pradesh
హనీ గ్యాంగ్ మా ఊరిలో గుప్త నిధులు ఎత్తుకు పోయింది: స్థానికుడు.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీకి చెందిన పొత్తూరు మోహన కృష్ణమ నాయుడు అలియాస్ మధుశ్రీ, హనీ గ్యాంగ్ తనను...
By Pagadala Venkateswar 2026-06-06 05:36:09 0 74
SURAKSHA
పోలీస్ సిబ్బంది నైపుణ్యాల పెంపు: నిరంతర శిక్షణ యొక్క ప్రాముఖ్యత
ప్రస్తుత కాలంలో పోలీసింగ్ సవాళ్లు వేగంగా మారుతున్నాయి, దీనివల్ల పోలీస్ బలగాలకు నిరంతర నైపుణ్య...
By Kalaga Sailaja 2026-06-24 09:45:59 0 74
Andhra Pradesh
Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు.
  Pawan Kalyan: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకల రద్దు.. పార్టీ...
By Pagadala Venkateswar 2026-03-10 08:56:20 0 160
Puducherry
Puducherry Strengthens Rural Development and Panchayats
Puducherry continues to promote rural development in 2026 by strengthening Panchayati Raj...
By Fathima Safa 2026-07-04 13:22:55 0 59
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com