Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.

0
131

అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను సృష్టించబోతోందో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్వాంటం ఇంజనీర్లు, అడ్వాన్స్‌డ్ ఏఐ నిపుణులు, కంప్యూటింగ్ స్పెషలిస్టులు, చిప్ డిజైనర్లు, క్రయోజెనిక్స్ ఎక్స్‌పర్టులు, ఆర్‌ఎఫ్ ఇంజనీర్లతో పాటు డీప్ టెక్ పరిశోధకులకు భారీ స్థాయిలో అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. శనివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూమిపూజ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేశ్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదని, అవి 'ఫ్యూచర్ ప్రూఫ్' ఉద్యోగాలని ఆయన నొక్కి చెప్పారు.

 

అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే పరిమితం కాదని, ఇది సైన్స్, కంప్యూటేషన్, ఇన్నోవేషన్ రాజధానిగా రూపాంతరం చెందబోతోందని లోకేశ్ ప్రకటించారు. "మన యువత అత్యాధునిక సాంకేతికతను కేవలం ఉపయోగించే వారుగా కాకుండా, దానిని సృష్టించే నిర్మాతలుగా మారాలన్నదే మా లక్ష్యం. క్వాంటం, డీప్ టెక్, ఏఐ వంటివి అమరావతి కొత్త గుర్తింపును నిర్వచిస్తాయి. ఇది ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించే నగరంగా, అత్యాధునిక టెక్నాలజీని ప్రపంచానికి ఎగుమతి చేసే కేంద్రంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

ఒకప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ విప్లవానికి ఎలా నాయకత్వం వహించిందో, ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి భారతదేశ క్వాంటం విప్లవానికి నేతృత్వం వహించబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి 14 ప్రఖ్యాత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ఇండస్ట్రీ, అకాడెమియా, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో తదుపరి సాంకేతిక శకానికి ఏపీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

 

భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటవుతోందని లోకేశ్ తెలిపారు. సూపర్‌ కండక్టింగ్, ఫోటానిక్, ఐయాన్ ట్రాప్ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌లు ఇక్కడ అభివృద్ధి కానున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు ఈ నూతన సాంకేతికతలపై శిక్షణ పొందుతున్నారని, దీర్ఘకాలంలో 10 లక్షల మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఐబీఎం, టీసీఎస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, క్యూపీఏఐ వంటి సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దిగ్గజ సంస్థల రాక, ప్రపంచ స్థాయి పరిశ్రమలు అమరావతిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రామసముద్రం హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కు ఉత్తమ సేవలకు అవార్డు.
రామసముద్రం పోలీస్ స్టేషన్‌లో 2004 బ్యాచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, విధి...
By Pagadala Venkateswar 2026-01-26 11:28:26 0 127
Telangana
RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల...
By Nookapangu Manikanta 2026-04-23 11:49:06 0 117
Andhra Pradesh
కర్నూలు జిల్లా లో ఉద్యోగాలు::
కర్నూలు : జిల్లాలోని కేజీబీవీ మోడల్ వెబ్-3, 4, విధి మోడల్ స్కూల్ నందు ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్...
By Hari Krishna 2026-01-03 05:52:16 0 193
Telangana
మొండా డివిజన్ లో సివరేజ్ పైప్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే.|
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మోండా డివిజన్ పరిధిలోని అంబేద్కర్ నగర్, టీచర్స్ కాలనీ, రైల్...
By Sidhu Maroju 2025-12-16 10:17:18 0 198
Andhra Pradesh
మదనపల్లి లో కారు ఢీకొని ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు.
ఆదివారం మదనపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మాలెపాడు గ్రామం, ఆవులపల్లికి చెందిన వెంకటేశ్,...
By Pagadala Venkateswar 2026-04-13 05:43:50 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com