చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.

0
123

చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.చీరాల ఎమ్మెల్యే కొండయ్య, నియోజకవర్గం అధికార ప్రతినిధి మహేంద్రనాధ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలిపారు. యువ నాయకుడు కీర్తి వెంకట్రావు చేరికతో టిడిపి పట్టణంలో మరింత బలం పుంజుకుందని వారు చెప్పారు.పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ పాలనతో పాటు ఎమ్మెల్యే కొండయ్య పనితీరు నచ్చి టిడిపిలో చేరుతున్నట్లు కీర్తి వెంకట్రావు తెలిపారు.వార్డు అభివృద్ధిని,ప్రజల సంక్షేమాన్ని ఎప్పటికీ మర్చిపోనని వెంకట్రావు వెల్లడించారు.కాగా ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. యువత కేరింతలు కొట్టారు.చివరగా పోలేరమ్మ ఆలయం వద్ద భారీ బహిరంగ సభ జరిగింది.దీంతో టీడీపీకి కొత్త జోష్ వచ్చింది.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
కార్మికుల సంక్షేమం కోసమే యూనియన్లు : ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మౌలాలి లోని N F C ( న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) అణు ఇంధన సంస్థ...
By Sidhu Maroju 2025-10-09 10:18:35 0 207
Andhra Pradesh
కవిటి: అర్హులందరికీ సకాలంలో సంక్షేమ పథకాలు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కవిటి మండలం బైరిపురంలో శనివారం నూతనంగా మంజూరైన...
By Jeeru Kumar 2026-03-01 06:31:32 0 394
Andhra Pradesh
ఆక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులను అందరికీ ఇంటి స్థలాలు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా యువజన...
By Benguluri Madhubabu 2026-03-16 10:55:46 0 135
Andhra Pradesh
పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-20 15:00:42 0 136
Andhra Pradesh
విజయవాడ భవానిపురం జోగి నగర్ ఇళ్ళ కూల్చివేత బాధితులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి
విజయవాడ   *వైసిపి అధినేత వైఎస్ జగన్ :*   25 సంవత్సరాలుగా‌ ఇక్కడే ఉంటున్నారు...
By Rajini Kumari 2025-12-16 10:15:44 0 168
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com