వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం

0
110

1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...

 

 1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..

 

ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.. 

 

పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు.. 

 

ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో పొక్లెయిన్ తెప్పించారు..

 

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని.. దాన్ని తొలగించేందుకు యత్నించారు.. 

 

పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు..

 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది..

 

ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని పొక్లెయిన్ను అడ్డుకున్నాడు.. 

 

తనపైనుంచి పోనిచ్చి, ర్యాంప్ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు..

 

చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు...

Search
Categories
Read More
Manipur
Kuki-Zo Council Pushes for Union Territory Status in Manipur |
The Kuki-Zo Council (KZC) has called for a political solution involving separation from Manipur...
By Pooja Patil 2025-09-16 07:06:34 0 160
Andhra Pradesh
ప్రకృతి సాగు రైతు రోశయ్య కు చంద్రబాబు నాయుడు ప్రశంసలు
*ప్రకృతి సాగు రైతు రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంస*   *75 సెంట్లలో 52 రకాల...
By Rajini Kumari 2026-03-13 14:00:13 0 120
Andhra Pradesh
కల్లూరు లో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-09 12:36:06 0 115
Telangana
న్యూఇయర్‌ వేడుకలు.. హద్దు మీరితే కఠిన చర్యలు
హైదరాబాద్‌: న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో తెలంగాణ ఈగల్‌ బృందం హెచ్చరికలు జారీ...
By SivaNagendra Annapareddy 2025-12-24 11:38:32 0 218
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com