వన్ బై త్రీ కాఫీ ఇవ్వలేదని హోటల్ యజమానిపై అధికారి నిర్వాకం

0
109

1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం...

 

 1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..

 

ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది.. 

 

పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు.. 

 

ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో పొక్లెయిన్ తెప్పించారు..

 

హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని.. దాన్ని తొలగించేందుకు యత్నించారు.. 

 

పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు..

 

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది..

 

ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని పొక్లెయిన్ను అడ్డుకున్నాడు.. 

 

తనపైనుంచి పోనిచ్చి, ర్యాంప్ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు..

 

చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు...

Search
Categories
Read More
Andhra Pradesh
ఐదు జిల్లాల కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
For scrolls   అమరావతి   *5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-17 09:31:55 0 163
Legal
Supreme Court Dismissed Lalit Modi's Plea
The Supreme Court on Monday dismissed a plea by former cricket administrator Lalit Modi, who had...
By Bharat Aawaz 2025-07-03 08:47:28 0 3K
Andhra Pradesh
కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం
విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా     ...
By Mobbu Venkatramana 2026-03-06 12:16:52 0 338
Telangana
మంచినీరు, డ్రైనేజ్ సమస్యలపై హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ మేనేజర్ కి వినతిపత్రం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం హెచ్ ఏ ఎల్, ఇతరి కాలనీలకు...
By Sidhu Maroju 2025-12-29 16:35:15 0 125
Andhra Pradesh
చౌడేపల్లిలో రామాలయం నిర్మాణానికి ప్రజల విజ్ఞప్తి కొత్తూరు మురళి
చౌడేపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో కొత్త రామాలయం నిర్మించాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలుగా...
By Kothuru Murali 2026-03-26 14:30:51 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com