విద్యార్థుల వేదన కదిలించింది

0
40

విద్యార్ధుల వేదన కదిలించింది

 

• సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు 

• తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు 

• రోడ్డు కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు

 

పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి.

• ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.

Search
Categories
Read More
Telangana
సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.
సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి...
By Sidhu Maroju 2025-07-12 17:07:24 0 1K
Andhra Pradesh
డిసెంబర్ 31 తో పథకం ముగింపు !!
కర్నూలు:  డిసెంబర్ 31తో 'SPREE' పథకం ముగింపునమోదు కాని సంస్థలు, కార్మికులను సామాజిక భద్రత...
By Hari Krishna 2025-12-21 09:38:52 0 103
Telangana
Sex Racket Busted in Banjara Hills |
Hyderabad: The Commissioner’s Task Force, West Zone, along with Banjara Hills Police,...
By Sidhu Maroju 2025-10-23 14:22:13 0 195
Andhra Pradesh
Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రితో కీలక భేటీ.
సీఎం చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక జలవనరుల అంశాలపై కేంద్ర...
By Pagadala Venkateswar 2026-02-10 09:44:17 0 21
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com