శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం

0
39

*శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం*

 

ఉండవల్లి: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ ట్రాఫిక్ పోలీస్ వాహన తనిఖీలు
ముమ్మరంగా వాహన తనిఖీలు చేస్తున్న విజయవాడ ట్రాఫిక్ పోలీస్::    విజయవాడ కనకదుర్గ వారధి...
By Rajini Kumari 2026-01-01 10:41:06 0 131
Telangana
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్...
By Sidhu Maroju 2025-06-02 10:23:36 0 1K
Telangana
ప్రభుత్వ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం విద్య ద్వారానే వ్యక్తి జీవితంలో మార్పులు... కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి...
By Gangaram Rangagowni 2025-12-24 10:51:10 0 137
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com