Pawan Kalyan: సోషల్ మీడియాలో విద్యార్థుల గోడు... కదిలిపోయిన పవన్ కల్యాణ్.

0
144

బురద రోడ్డుపై విద్యార్థుల ఆవేదన.. సోషల్ మీడియాలో వీడియో

వీడియో చూసి చలించిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

గజ్జలవారిపల్లికి రూ.86 లక్షలతో తక్షణమే రోడ్డు మంజూరు

కూటమి ప్రభుత్వంలో ఉదయగిరిలో రూ.55 కోట్ల రోడ్ల పనులు

ఈ రోడ్డు మంజూరుతో విద్యార్థులు, రైతుల కష్టాలకు తెర

"పవన్ సర్.. రోజూ బురదలో నడుస్తూ స్కూలుకు వెళ్లలేకపోతున్నాం. దయచేసి మా ఊరికి రోడ్డు వేయండి" అంటూ విద్యార్థులు చేసిన విన్నపం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కదిలించింది. సామాజిక మాధ్యమాల్లోని ఒక వీడియోలో విద్యార్థులు పడుతున్న వేదనను చూసి చలించిపోయిన ఆయన, తక్షణమే స్పందించి గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ఆ దారి బురదమయంగా మారి నరకాన్ని తలపిస్తోంది. తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో, వారు తమ కష్టాలను వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శుక్రవారం ఈ వీడియో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చింది. విద్యార్థుల ఆవేదనను చూసిన ఆయన వెంటనే నెల్లూరు జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన అంచనాలను వెంటనే రూపొందించి, పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

 

పవన్ కల్యాణ్ ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలు సిద్ధం చేసి, పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లి విద్యార్థులకే కాకుండా, పొలాలకు వెళ్లే రైతులకు కూడా ఏళ్లనాటి కష్టాలు తీరనున్నాయి.

 

ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 'పల్లెపండగ 1.0, 2.0', సాస్కీ నిధులతో కలిపి సుమారు రూ. 55 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టుల కింద మొత్తం 641 రోడ్ల నిర్మాణం జరుగుతోంది. వీటికి అదనంగా, తాజాగా విద్యార్థుల అభ్యర్థన మేరకు గజ్జలవారిపల్లి రోడ్డును ప్రత్యేకంగా మంజూరు చేయడం గమనార్హం.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: బెగ్గిపల్లె గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.
Andhra Chandrababu Distributes Pensions Door to Door in Beggi Palle కుప్పం నియోజకవర్గంలో రెండో...
By Pagadala Venkateswar 2026-01-31 10:36:55 0 121
Andhra Pradesh
మదనపల్లిలో నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం.
మదనపల్లె చీగలబైలు పంచాయతీలోని వెంకటమ్మ చెరువు సప్లై ఛానెల్ పనులను ఎమ్మెల్యే షాజహాన్, ఏఎంసీ...
By Pagadala Venkateswar 2026-04-08 05:55:48 0 112
Telangana
నిజామాబాద్: వైన్స్ షాపులకు దేవులా పెర్లు పెటకుండ చట్టం తెవాలి ఎమ్మెల్యే ధనపాల్సూర్యనారాయణ
వైన్‌షపులకు దేవుల పెర్లు తోలాగిన్‌చెలా, కొత్తగపేటకుండ చాటముటిసుకురవాలాని.ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-03-30 17:35:48 0 137
Bharat Aawaz
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
By Hazu MD. 2026-05-20 08:43:14 0 47
Andhra Pradesh
మదనపల్లి: నిరుపేదలకు సీఎం సహాయనిధి వరం: ఎమ్మెల్యే.
మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా బుధవారం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులను...
By Pagadala Venkateswar 2026-04-16 03:24:26 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com