YS Sharmila: చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల.

0
50

ఐదేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ ఉద్యమాలు చేయడమేంటని షర్మిల ప్రశ్న

 

సంగమేశ్వరం బదులు ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కట్టడంపై అభ్యంతరం

 

స్వప్రయోజనాల కోసం సీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ

ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరూ నాటకాలు ఆడారాని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుబట్టారు.

 

వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి తర్వాత ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు" అని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎన్జీటీ వద్ద బలమైన వాదనలు వినిపించకుండా, కేంద్రం నుంచి అనుమతులు తీసుకురాకుండా ఇప్పుడు ఆందోళనలు ఎందుకని ప్రశ్నించారు. "ఐదేళ్లు ప్రధాని మోదీకి దత్తపుత్రుడిగా ఉన్న జగన్‌కు అప్పుడు సీమకు నీళ్లివ్వాలని గుర్తుకురాలేదా?" అని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి, సీమ ప్రాజెక్టుల వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆమె విమర్శించారు.

 

 

 

మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు సంగమేశ్వరం వద్ద కాకుండా ముచ్చుమర్రి వద్ద ప్రాజెక్టు కడతామని చెప్పడాన్ని కూడా షర్మిల తప్పుబట్టారు. "ఎవరిని మోసం చేయడానికి ఇద్దరూ కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు? మోదీ దగ్గర సాగిలపడి సీమకు అన్యాయం చేస్తారా?" అని ఆమె తీవ్రంగా ప్రశ్నించారు. ఇద్దరు నేతలు తమ వైఖరిని మార్చుకోవాలని, సీమ ప్రయోజనాలను కాపాడాలని ఆమె డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Punjab
ਪੰਜਾਬ ਵਿੱਚ ਬਾਢ਼ ਪੀੜਤਾਂ ਲਈ ਰਾਹਤ ਸਮੱਗਰੀ ਵੰਡੀ ਗਈ
ਬੰਗਾਲ ਤੋਂ ਆਈ #ਸਮਾਜਿਕਸੇਵਕਾਂ ਦੀ ਟੀਮ ਨੇ "#ਪੰਜਾਬਕਾਲਿੰਗ - ਬਾਢ਼ਰਾਹਤਡ੍ਰਾਈਵ2025" ਤਹਿਤ ਅਜਨਾਲਾ, ਡੇਰਾ ਬਾਬਾ...
By Pooja Patil 2025-09-13 07:47:12 0 123
Andhra Pradesh
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని  తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
By Gadiyapudi Narendra 2025-12-26 14:58:42 0 163
Telangana
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
By Sidhu Maroju 2025-06-07 09:18:04 0 1K
Telangana
అల్వాల్ సర్కిల్ ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ సమస్యలు - గత పది నెలలుగా ప్రజల ఇబ్బందులు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్ కాలనీ ప్రజలు...
By Sidhu Maroju 2025-08-31 04:12:28 0 296
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com