Jogi Ramesh: జోగి రమేశ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు.

0
163

బెయిల్ పై ఉన్న జోగి రమేశ్ కు మరో షాక్

జగన్ పర్యటన సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కేసు

పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన ఎస్సై

కల్తీ మద్యం కేసులో ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు మరో షాక్ తగిలింది. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: ( 143, 188, 290, 336, 341, 353 r/w 149 IPC) సెక్షన్ల కింద కేసు నమోదయింది. 

 

కేసు వివరాల్లోకి వెళితే... జోగి రమేశ్ ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ నిన్న ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీలు, పబ్లిక్ న్యూసెన్స్, జన సమీకరణ చేశారని ఎస్సై రవి వర్మ ఫిర్యాదు చేశారు. రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని తెలిపారు. జన సమీకరణ, ర్యాలీలు చేపట్టవద్దని కఠిన నిబంధనలు విధించినా... వాటిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. 

 

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూడా జోగి రమేశ్ పై మరో కేసు నమోదయింది. పోలీసులు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు పెట్టారు. సెక్షన్ 223, 189 క్లాజ్ 2, 292, 125క్లాజ్ 2, 126క్లాజ్ 2, 132, 190, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ను మళ్లీ అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.

Search
Categories
Read More
Telangana
కొడుకులు పట్టించుకోవడం లేదు పోలీస్ స్టేషన్లో ఆశ్రమించిన వృద్ధ దంపతులు....
భారత్ అవాజ్ న్యూస్:23 జూన్ రోజున వరంగల్ జిల్లా  దుగ్గొండి:  మండలం వెంకటాపురం...
By Gujile Ramu 2026-06-23 08:18:14 0 124
Andhra Pradesh
వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ వాయిదా.
AP: వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం ఉందా? లేదా?.. ఉంటే ఎవరెవరిని విచారించాలో...
By Pagadala Venkateswar 2026-01-20 06:25:58 0 189
Andhra Pradesh
తట్టివారిపల్లె చెరువు వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలం తట్టివారిపల్లె చెరువు వద్ద ఆదివారం ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-04-12 04:39:26 0 128
Andhra Pradesh
ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో కలిసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) సుప్రియ రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ
37వ జాతీయ రహదారి భద్రత మహోత్సవాల సందర్భంగా, పుంగునూరు పట్టణంలో ప్రైవేట్ కళాశాల విద్యార్థులతో...
By Kothuru Murali 2026-01-07 12:54:33 0 184
Ladakh
Ladakh Preserves Cultural Heritage and Buddhist Legacy
Ladakh continues to preserve its rich cultural heritage through the conservation of centuries-old...
By Fathima Safa 2026-07-01 10:19:51 0 53
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com