Kollu Ravindra: బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని జగన్ పరామర్శిస్తున్నారు: కొల్లు రవీంద్ర.

0
95

ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో జగన్ చూపించారన్న కొల్లు రవీంద్ర

జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని వ్యాఖ్య

జగన్ వల్లే ఆ పార్టీ 11కి పడిపోయిందని ఎద్దేవా

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి విమర్శలు గుప్పించారు. ఆటవిక రాజ్యం అంటే ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ చూపించారని ఆయన అన్నారు. జగన్ కు జంగిల్ రాజ్ అవార్డు ఇవ్వొచ్చని వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ ఆటవిక రాజ్యంలో హింసాత్మక ఘటనలను జగన్ ప్రోత్సహించారని విమర్శించారు. దేవాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేయించారని దుయ్యబట్టారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

బూతులు తిట్టి తన్నులు తిన్నవారిని పరామర్శించేందుకు జగన్ వెళుతున్నారని... పరామర్శలకు వెళుతూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ ను పరామర్శించి... ఇలాంటి వారిని తాను ప్రోత్సహిస్తాననే విధంగా సందేశం ఇచ్చారని విమర్శించారు. జగన్ చేతల వల్లే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయిందని అన్నారు. ఇప్పటికైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని... లేకపోతే అథఃపాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*   వాజ్ పాయ్ ఒక నిష్కల చరిత్రుడు, అజాత...
By Rajini Kumari 2025-12-12 12:57:27 0 224
Andhra Pradesh
మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న కేశినేని నాని గారు
*మేడారం సమ్మక్క–సారక్క గద్దెను దర్శించుకున్న కేశినేని నాని గారు*   * ములుగు జిల్లా...
By Rajini Kumari 2026-01-13 15:44:10 0 134
Andhra Pradesh
తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం
వ్యక్తి అదృశ్యం 17 9 20 25వ తేదీన తెల్లవారుజామున సుమారు రెండు గంటల సమయం నుండి మాదినేని విజయ్...
By mahaboob basha 2025-09-19 14:21:33 0 263
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com