Ambati Rambabu: ఏపీ హైకోర్టులో 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన అంబటి రాంబాబు.

0
84

Andhra

Ambati Rambabu Files 7 Quash Petitions in AP High Court

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటిపై 7 కేసులు నమోదు

 

అన్ని కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్లు వేసిన అంబటి

నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించిన విచారణను ఈ నెల 11కు వాయిదా వేసిన హైకోర్టు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆయనపై పట్టాభిపురం, మంగళగిరి, నగరంపాలెం, నల్లపాడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఆయన 7 క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. 

 

ఇప్పటికే నల్లపాడు పీఎస్ లో నమోదైన కేసుకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణను ఈ నెల 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. మంగళగిరి పీఎస్ లో నమోదైన కేసులో తప్పనిసరిగా బీఎన్ఎస్ 35(3)ను అనుసరించాలని మంగళగిరి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. 

 

మిగిలిన 5 కేసులకు సంబంధించిన క్వాష్ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్వాష్ పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

 

మరోవైపు, అంబటిపై పీటీ వారెంట్ పొందేందుకు మంగళగిరి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

Search
Categories
Read More
Delhi - NCR
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament
Rijiju Cautions Rahul Gandhi Over 'Anti-National' Remarks in Parliament Parliamentary Affairs...
By Bharat Aawaz 2025-07-17 08:30:37 0 1K
Andhra Pradesh
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ చేసిన దొంగల అరెస్టు...
  పొన్నూరు: గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కామెంట్స్ చింతలపూడి గ్రామంలో పొన్నూరు...
By Gadiyapudi Narendra 2026-02-24 17:18:35 0 212
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 76
Andhra Pradesh
అమరావతి రాజధాని బిల్లు ఆమోదం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద ఉత్సవాహం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా...
By Benguluri Madhubabu 2026-04-02 11:11:52 0 71
Telangana
మెడికవర్ ఆసుపత్రిలో ప్యాంక్రియాటిక్ క్లినిక్ ప్రారంభం.|
సికింద్రాబాద్ : తెలంగాణలో యుక్త వయసులో ఉన్నవారికి ఇటీవల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గణనీయంగా వృద్ధి...
By Sidhu Maroju 2025-11-14 11:20:45 0 159
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com