శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|

0
64

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గత కొన్ని రోజులుగా అధికారులపై ఒత్తిడి తెస్తూ.. నిరంతరం ఫాలో అప్ చేయడంతో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుడ్లపుడెక్క తొలిగింపు పనులు ఈరోజు లాంచనంగా ప్రారంభమయ్యాయి.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా పాల్గొని పనులను పర్యవేక్షించారు. వారితోపాటు ఎస్ డబ్ల్యూ మేనేజ్మెంట్ డిఇ. సత్యనారాయణ, ఏ.ఇ. సమీర్, ఎంటమాలజీ ఏఇ. అనిల్, ఎస్ ఎఫ్ ఏ వెంకట్రామిరెడ్డి, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

 

స్థానిక కాలనీలో ప్రజలు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చి, కార్పోరేటర్ చేసిన కృషిని అభినందించారు.

 

చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరగడం వల్ల దోమల ఉధృతి పెరిగి, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని కార్పొరేటర్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు.

 

నీటి ప్రవాహాన్ని మెరుగుపరచడం, మరియు పారిశుద్ధాన్ని కాపాడడం ద్వారా పరిసర ప్రాంతాల ప్రజలకు ఊరట లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

 

పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా వేగవంతంగా పూర్తి చేసి చెరువును పూర్తిస్థాయిలో గుర్రపు డెక్క రహితంగా తీర్చిదిద్దాలని ఆమె అధికారులను ఆదేశించారు. 

 

దీనికి అధికారులు స్పందిస్తూ.. అవసరమైన యంత్రాలను మొహరించి వీలైనంత త్వరగా ప్రక్షాళన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

 

స్థానిక సమస్యల పరిష్కారంలో నిరంతరం ముందుంటున్న కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డికి, సమీప కాలనీ నివాసితులు ధన్యవాదాలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ...
By Pagadala Venkateswar 2026-01-23 06:49:03 0 55
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్...
By Kothuru Murali 2026-01-25 11:43:18 0 65
Andhra Pradesh
ఆస్తి కోసం ఎంతకు తెగించావురా.. బతికుండగానే తల్లిని చంపేశాడు… ఇక నెలకు 15 వేలు కట్టాల్సిందే.
ఆస్తి కోసం తల్లి బతికుండగానే రికార్డుల్లో చంపేశాడు కొడుకు. తప్పుడు మరణ ధృవీకరణ పత్రంతో భూమిని...
By SivaNagendra Annapareddy 2025-12-23 15:46:44 0 168
Andhra Pradesh
వెట్టిచాకిరి చేయిస్తున్నారని కలెక్టర్‌కు డాక్టర్ల ఫిర్యాదు.
మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని...
By Pagadala Venkateswar 2026-02-12 04:49:19 0 22
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com