డ్రగ్స్ పై దండయాత్ర

0
115

*ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ* 

 

 *పత్రికా ప్రకటన* *తేదీ. 05.02.2026*

 

 *🔴 డ్రగ్స్ పై దండయాత్ర నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పదవ రోజు🚴 సైకిల్ యాత్ర కార్యక్రమం.* 

 

🔴 *పదవ రోజు అయిన ఈ రోజు నున్న నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నున్న వాంబే కాలని జి బ్లాక్ వద్ద నుండి వద్ద జీవితాన్ని ప్రేమించు డ్రగ్స్ కు దూరంగా ఉండు అనే నినాదంతో సుమారు 200 విద్యార్థులు సైకిల్స్ తొక్కుతూ సైకిల్ యాత్ర కార్యక్రమం ప్రారంభమైనది.*

 

*🔴 అజిత్ సింగ్ నగర్ పోలీస్ వారు దండయాత్రను వాంబే కాలని జి బ్లాక్ వద్దకు రాగా నున్న పోలీస్ స్టేషన్ వారు డప్పులు, సన్నాయి లతో స్థానిక మహిళలు ఘనంగా పూలు చల్లుతూ హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికినారు .* 

 

*🔴 ఈ కార్యక్రమంలో ఈ రోజుకూడా నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఐ.పి.ఎస్ గారు, ఈగల్ ఐ.జి. శ్రీ ఆకే రవికృష్ణ ఐ.పి.ఎస్.గారు, ఎం.ఎల్.ఏ.శ్రీ బోండా ఉమమహేశ్వర రావు గార్లు ముఖ్య అతిధులుగా పాల్గొని అవగాహన కల్పించారు.*

 

*🔴 ఈ కార్యక్రమం ఏ.డి.సి.పి. శ్రీ జి.రామకృష్ణ గారి పర్యవేక్షణలో నార్త్ ఏ.సి.పి. శ్రీమతి స్రవంతి రాయ్ గారు, ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ మోహన్ గారు వారి సిబ్బందితో ఘనంగా ఏర్పాట్లు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.* 

 

*🔴9వ రోజు నిరంతర పోరాటాన్ని విజయవంతంగా పూర్తి చేసిన దండయాత్ర ఈరోజు 10వ రోజుకు అడుగుపెట్టింది,కానీ ఉత్సాహం తగ్గలేదు, రెట్టింపు అయింది. ప్రజల మద్దతు పెరుగుతోంది అంటే కారణం ఒక్కటే: ఇది కేవలం కార్యక్రమం కాదు, భవిష్యత్తు కోసం జరుగుతున్న యుద్ధం.*

 

*🔴 ఇప్పటికే 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుని నిరంతరాయంగా అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ఇది యాత్ర కాదు. ఇది యువత భవిష్యత్తు కాపాడే సంకల్పం*

 

*🔴 ఈ సందర్భంగా అధికారులు డ్రగ్స్ పై ఎటువంటి సమాచారాన్ని అయిన 112 కు గాని 1972 కి గాని తెలియజేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ https://events.ntrpolice.in/ లాగిన్ అయ్యి రిజిస్టర్ అవ్వలని తెలియజేశారు.*

 

*🔴 ఈ కార్యక్రమంలో ఇండ్లాస్ శాంతివనం డా. ఆశిష్ గారు, స్థానిక కార్పొరేటర్ శ్రీమతి దుర్గాగారు, నేతలు , ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అరవ రమేష్ గారు మరియు పెద్ద ఎత్తున స్థానిక మహిళలు, విద్యార్థులు పాల్గొన్నా రు.*

 

***

Search
Categories
Read More
Telangana
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...
By Sidhu Maroju 2026-03-28 06:50:31 0 96
Telangana
పేద విద్యార్థుల స్కూల్ ఫీజులను చెల్లించి తన 'ఉదారత' ను చాటుకున్న బిజెపి నాయకురాలు.|
మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లా : కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్ ల ను అనుసరిస్తూ మచ్చ...
By Sidhu Maroju 2025-11-18 09:12:14 0 157
Telangana
హైదరాబాద్‌లో త్రివర్ణ పతాక ర్యాలీ – జాతీయ గర్వానికి పిలుపు
హైదరాబాద్-తెలంగాణ: ఈ నెల 14న హైదరాబాద్‌లో ప్రత్యేకమైన తిరంగ ర్యాలీ...
By Bharat Aawaz 2025-08-11 11:59:25 0 988
Andhra Pradesh
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి...
By BABJI DADALA 2026-03-02 14:21:12 0 103
Andhra Pradesh
గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ఎన్. సి. సి అవార్డు.
మదనపల్లె మండలం సి. టి. ఎమ్. పాఠశాల ఎన్. సి. సి ఆఫీసర్ గిరిధర్ నాయక్ కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక...
By Pagadala Venkateswar 2026-03-01 04:26:53 0 83
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com