అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన శ్రీ నెట్టెం రఘురాం

0
107

ప్రెస్ నోట్

04.02.2026

 

అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం

 

అమరావతి: కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (KDCCB) చైర్మన్ శ్రీ నెట్టెం రఘురాం గారు ఈ రోజు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, కేడీసీసీ బ్యాంక్ పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) మరియు వాటిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు పరిపాలనా అంశాలపై పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వినతిపత్రం సమర్పించారు

 

కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో PACS సంఘాల్లో సీఈఓ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పరిపాలనలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఒకసారి ప్రత్యేక ప్రమోషన్లను పరిశీలించవలసిందిగా ఆయన అభ్యర్థించారు. 

 

పలు గ్రామీణ PACS సంఘాలు డైలీవేజ్ సిబ్బందిపై ఆధారపడి పనిచేస్తున్నాయని, అందువల్ల అర్హత పరీక్ష నిర్వహించి, అర్హులైన వారికి న్యాయబద్ధంగా అవకాశం కల్పించాలనే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు.

 

కేడీసీసీ బ్యాంక్ మరియు PACS ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు విషయమై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తింపజేసిన విధంగా వీరికి కూడా పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచితే అనుభవజ్ఞులైన సిబ్బంది సేవలు మరింత కాలం అందుబాటులో ఉంటాయని తెలిపారు.

 

కొన్ని వేతనాలు “Suspense Due To Account” కింద నిల్వ ఉండటం వల్ల ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు తగిన మార్గదర్శకాలు జారీ చేయవలసిందిగా ఆయన కోరారు. అదేవిధంగా, అవసరమైన విద్యార్హతలు పొందేందుకు గతంలో ఇచ్చిన గడువును మరికొంత కాలం పొడిగిస్తే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందని, వారి ఉద్యోగ భద్రత కాపాడబడుతుందని అభ్యర్థించారు.

 

ఈ వినతులన్నీ ఉద్యోగుల ప్రయోజనాలకే పరిమితం కాకుండా, గ్రామీణ సహకార వ్యవస్థ బలోపేతానికి, రైతులకు నిరంతర సేవలందించేందుకు దోహదపడతాయని శ్రీ నెట్టెం రఘురాం గారు తెలిపారు. 

 

ముఖ్యమంత్రి గారు నెట్టెం రఘురాం గారి వినతిని శ్రద్ధగా విని, సంబంధిత శాఖలతో పరిశీలించి సాధ్యమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి చెందిన భూమి ని పరిశీలిస్తున్నారు
ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు నియోజకవర్గం, మద్దిపాడు మండలం, కొలచనకోట గ్రామానికి SC Corporation కి...
By Chennaiah Kati 2026-02-08 05:52:09 0 183
Telangana
మేడారం వెళ్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా
బుధవారం ములుగు జిల్లా తడ్వాయి మండల కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం జిల్లా...
By Prashanth Goindla 2026-02-04 06:09:46 0 195
Andhra Pradesh
సిద్ధివారిపాలెంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించిన మాజీ MLA "పర్వత"...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సిద్ధివారిపాలెం గ్రామంలో ప్రత్తిపాడు మాజీ...
By BABJI DADALA 2026-01-12 02:27:10 0 268
Telangana
₹50 లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎం.పి
     కంటోన్మెంట్ వార్డు 5 జ్యోతి కాలనీలో 50 లక్షల రూపాయలతో చేపట్టిన నీటి సరఫరా...
By Sidhu Maroju 2025-06-04 17:02:21 0 1K
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల లో గురువారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్లా బాబు,...
By Kothuru Murali 2026-02-26 12:53:13 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com