ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...

0
478

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కూలీలు చెట్లు నరికే పనుల కోసం ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరాంపురం గ్రామం నుంచి ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెట్లు నరికే పనుల నిమిత్తం 14 మంది కూలీలతో ఆటో బయలుదేరింది. ఈ క్రమంలో కత్తిపూడి వద్ద పిఠాపురం నుంచి రౌతులపూడి వైపు వెళుతున్న టిప్పర్ లారీని ఆటో బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమవ్వగా, అందులో ప్రయాణిస్తున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు.

ఈ ప్రమాదంలో శ్రీరాంపురం గ్రామానికి చెందిన పితాని కామరాజు (65) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో పన్నెండు మంది కూలీలు గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, గాయపడిన వారిని ఆటోల్లో, అంబులెన్సుల్లో ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. #దడాల babji

Search
Categories
Read More
Rajasthan
Nurse Suicide Sparks Fierce Protests Over 6500 Layoffs
Rajasthan is engulfed in massive protests after the government terminated nearly 6,500...
By Tejaswini Komanduru 2026-06-15 09:22:03 0 122
Telangana
గూడు లేని పక్షులు....మణెమ్మ పిల్లలు
అమ్మలేని లోకం.. అనాథలైన  పిల్లలు  ​Mahabubabad::కొత్తగూడ మండల కేంద్రం లో ఒక విషాదం....
By Bheeshman King 2026-07-03 08:00:47 0 405
Andhra Pradesh
మార్చి 16 నుంచి 28 వరకు ఓపెన్ స్కూల్ (APOSS - 2026) 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని :జిల్లా జాయింట్ కలెక్టర్ భావన.,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల: ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కేంద్రాలు,  పరీక్షలు జరిగే...
By Gadiyapudi Narendra 2026-02-17 15:50:05 0 181
SURAKSHA
Empowering Arunachal Police: Quality Housing & Modern Living
The establishment of the Arunachal Pradesh Police Housing & Welfare Corporation Limited...
By Lokeshwari Panthadi 2026-07-04 09:01:28 0 71
Andhra Pradesh
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐ
పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా,...
By Kothuru Murali 2026-03-27 14:48:50 0 172
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com