యోగా వలన శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు .

0
197

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం సిబ్బందికి గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న “మోబిలైజేషన్ (శిక్షణ) కార్యక్రమం” లో భాగంగా, ఈరోజుగుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారి ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి యోగా అభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందితో వివిధ యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు చేయించడమేకాక, యోగా వలన కలిగే శారీరక, మానసిక ప్రయోజనాలను వివరించారు. శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం ఎంతో కీలకమైన పోలీస్ శాఖ వంటి సేవా రంగంలో పనిచేసే సిబ్బందికి యోగా అత్యంత అవసరమని అదనపు ఎస్పీ గారు తెలిపారు.

 👉 ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ...

🔅యోగా, ధ్యానం అనేవి మనిషి శారీరక, మానసిక స్థితిగతులను సానుకూలంగా మార్చగల శక్తిని కలిగి ఉంటాయని, నిరంతర యోగా అభ్యాసం వలన

* ఆలోచనా విధానం, నిర్ణయాత్మక సామర్థ్యం మెరుగుపడతాయని

* మానసిక స్థిరత్వం, ప్రశాంతత అలవడుతాయని

* ఒత్తిళ్లు, విధులలో వచ్చే మానసిక ఒడిదుడుకులను అధిగమించే శక్తి పెరుగుతుందని

* క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ పెరిగి, దురలవాట్లకు దూరంగా ఉండేందుకు దోహదపడుతుందని తెలిపారు.

🔅 అదనంగా పోలీస్ విధుల్లో ఉండే అధిక ఒత్తిడి, రాత్రి విధులు, అత్యవసర పరిస్థితుల్లో పనిచేయడం వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అలాంటి పరిస్థితుల్లో యోగా, ధ్యానం పోలీస్ సిబ్బందికి ఒక మానసిక రక్షణ కవచంలా పనిచేస్తాయని తెలిపారు. యోగా అభ్యాసం వలన శ్వాస నియంత్రణ మెరుగుపడి, అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా స్పందించే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

🔅 నిత్యం యోగా అభ్యాసం చేయడం ద్వారా గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, మానసిక ఆందోళనలు తగ్గి, విధి నిర్వహణలో సమర్థత పెరుగుతుందని అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (ఏఆర్) శ్రీ ఏ. హనుమంతు గారితో పాటు, ఏఆర్ డీఎస్పీ శ్రీ సంకురయ్య గారు, ఆర్‌ఐలు శ్రీ శ్రీహరి రెడ్డి, సురేష్, శివరామకృష్ణ, శ్రీనివాసరావు, రామకృష్ణ రెడ్డి గారు తదితర పోలీస్ అధికారులు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు..

Search
Categories
Read More
Andhra Pradesh
అమరావతి రాజాధానిపై బొబ్బిలిలో సంబరాలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించినందుకు గురువారం బొబ్బిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఉద్యోగులు...
By Boiena Rajesh 2026-04-03 00:53:49 0 60
Andhra Pradesh
పుంగనూరు: అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి.
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు గురువారం అధికారుల నిర్లక్ష్య వైఖరిని...
By Kothuru Murali 2026-01-30 04:35:00 0 138
International
“⚠️ పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?”
ఈరోజు ఉదయం వచ్చిన తాజా వార్త మీ కోసం… దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే...
By Thokala Sivaji 2026-03-25 01:56:37 0 335
Andhra Pradesh
చిన్న తిప్ప సముద్రంలో జాతీయ సైన్స్ దినోత్సవం.
మదనపల్లి మండలం చిన్నతిప్పసముద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని...
By Pagadala Venkateswar 2026-02-28 10:54:55 0 76
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 817
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com