Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.

0
37

రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా

అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం

ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేశ్ రేపు (ఫిబ్రవరి 4) కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు.

 

ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న లోకేశ్, బుధవారం పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు.

 

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేశ్ చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రూ.92,649 కోట్ల పనుల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. కీలక సమావేశాల అనంతరం బుధవారం రాత్రికి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా? దుర్భుద్ధి తో చూసే వారికీ ప్రజాభిమానం ఎలా తెలుస్తుంది..సయ్యద్ గౌస్ మోహిద్దీన్
జగన్ పై కూటమి నేతలు అక్కసును వెళ్లగక్కడమే పనిగా పెట్టుకున్నారా దుర్భుద్ధి తో చూసే వారికీ...
By mahaboob basha 2025-11-21 13:32:18 0 302
Andhra Pradesh
గణతంత్ర దినోత్సవ వేడుకలను పరిశీలించిన వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా పోలీస్   *గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతు రిహార్సల్స్ ను పరిశీలించిన జిల్లా...
By Rajini Kumari 2026-01-25 11:11:48 0 80
Tamilnadu
Stalin writes to CMs of non-BJP ruled states, urges to oppose Presidential reference in Supreme Court
Chennai: Tamil Nadu Chief Minister MK Stalin wrote to eight non-BJP ruled states’ chief...
By BMA ADMIN 2025-05-19 19:03:41 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com