Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.

0
98

రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా

అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం

ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేశ్ రేపు (ఫిబ్రవరి 4) కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు.

 

ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న లోకేశ్, బుధవారం పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు.

 

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేశ్ చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రూ.92,649 కోట్ల పనుల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. కీలక సమావేశాల అనంతరం బుధవారం రాత్రికి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Search
Categories
Read More
Jammu & Kashmir
🔥 Fierce Encounter in Udhampur: Terrorists Cornered in Basantgarh Forest
A major counter-terrorism operation is currently underway in Basantgarh, Udhampur district...
By Bharat Aawaz 2025-07-09 13:00:09 0 1K
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఒక వ్యక్తి వీరంగం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం ఒంటినిండా రక్తంతో ఉన్న ఓ వ్యక్తి వీరంగం...
By Pagadala Venkateswar 2026-03-10 04:35:37 0 77
Andhra Pradesh
బీసీల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయం
*ప్ర‌చుర‌ణార్ధం* *23-02-2026*   బిసిల‌ అభ్యున్నతికి ఐలాపురం...
By Rajini Kumari 2026-02-23 10:30:12 0 94
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 104
Andhra Pradesh
100 గ్రాముల లిక్విడ్ గంజాయి, 3.2 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి గారు.
🚩 గుంటూరు జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్...
By John Baji 2026-01-11 04:34:04 0 143
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com