Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.

0
169

రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా

అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం

ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేశ్ రేపు (ఫిబ్రవరి 4) కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు.

 

ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న లోకేశ్, బుధవారం పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు.

 

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేశ్ చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రూ.92,649 కోట్ల పనుల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. కీలక సమావేశాల అనంతరం బుధవారం రాత్రికి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
బాపట్ల జిల్లాలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు* *ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శక్తి స్టాల్*
ఈ సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో 5 శక్తి బృందాలు నిరంతరం...
By Vadlamudi NagaVenkat 2026-03-08 15:37:45 0 900
Andhra Pradesh
మదనపల్లెలో గుర్రపు స్వారీ, కత్తి సాము ప్రదర్శనలు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పోలీస్ పరేడ్ మైదానంలో గుర్రపు స్వారీ,...
By Pagadala Venkateswar 2026-01-26 12:06:41 0 182
Andhra Pradesh
బస్సు ఆపకుండా వెళ్ళిపోయినందుకు బస్సు డ్రైవర్ ని చెప్పుతో కొట్టిన మహిళ
*ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో కొట్టిన మహిళ.*     బస్సు ఆపలేదనే కారణంతో ఆర్టీసీ...
By Rajini Kumari 2026-04-24 12:18:38 0 147
Karnataka
BESCOM Opens Holiday Services for Power Applications
The Karnataka government has directed BESCOM offices to remain operational during holidays to...
By Navya Sree 2026-06-25 13:45:41 0 77
Lakshdweep
Fisheries Sector Growth and Economic Progress in Lakshadweep
The fisheries sector plays a vital role in Lakshadweep’s economy, providing employment and...
By Fathima Safa 2026-06-18 09:25:14 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com