Nara Lokesh: ఢిల్లీ చేరుకున్న నారా లోకేశ్... రేపు కేంద్రమంత్రులతో వరుస సమావేశాలు.

0
97

రాష్ట్ర అభివృద్ధి, నిధుల సమీకరణే ప్రధాన అజెండా

అమరావతి, విభజన హామీలపై చర్చించే అవకాశం

ఐటీ, విద్యా రంగాల విస్తరణపై ప్రత్యేక దృష్టి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీడీపీ ఎంపీలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ఎంపీలతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కాగా, రాష్ట్రానికి సంబంధించిన కీలక అభివృద్ధి పనులపై చర్చించేందుకు, నిధులు రాబట్టేందుకు లోకేశ్ రేపు (ఫిబ్రవరి 4) కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశం కానున్నారు.

 

ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్న లోకేశ్, బుధవారం పార్లమెంట్ భవనంలో పలువురు కేంద్ర మంత్రులతో కీలక భేటీలు జరపనున్నారు. ఈ పర్యటనలో ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగ సంస్కరణలు వంటి అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు ఏపీ విభజన చట్టంలోని హామీల అమలు, అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపనున్నారు.

 

ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనపై సంబంధిత శాఖల మంత్రులతో లోకేశ్ చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో పురోగతిలో ఉన్న రూ.92,649 కోట్ల పనుల వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై హై-స్పీడ్ రైల్వే కారిడార్ల అంశంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. కీలక సమావేశాల అనంతరం బుధవారం రాత్రికి ఆయన తిరిగి ఉండవల్లిలోని నివాసానికి చేరుకోనున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ నాడు అసెంబ్లీలో జై...
By Pagadala Venkateswar 2026-01-17 11:19:01 0 125
Telangana
అల్వాల్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ - పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ మండల రెవెన్యూ అధికారి (MRO) కార్యాలయంలో ఈరోజు కళ్యాణ లక్ష్మీ...
By Sidhu Maroju 2026-03-12 08:01:10 0 98
Andhra Pradesh
సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి మానస పేటలో సంక్రాంతి సంబరాలు లో పాల్గొన్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
By Benguluri Madhubabu 2026-01-16 13:08:38 0 255
Telangana
ఛలో అసెంబ్లీ SFI పిలుపు
పెండింగ్ స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో...
By Veeresh Kumar 2026-03-24 18:01:22 0 135
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com