Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు.

0
123

Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు

03-02-2026 Tue 21:46 | Andhra

Achchennaidu welcomes US trade deal boost for AP aqua sector

భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌ల తగ్గింపు

ఏపీ ఆక్వా రైతులకు ఇది శుభవార్త అన్న మంత్రి అచ్చెన్నాయుడు

25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన సుంకం

10 నుంచి 15 శాతం పెరగనున్న సీఫుడ్ ఎగుమతులు

 

రైతులు, మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని అంచనా

 

భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లను తగ్గించడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వాకల్చర్ రంగానికి గణనీయమైన ఊరటనిస్తుందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం, ఆక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరం లాంటిదని ఆయన అభివర్ణించారు. దీనివల్ల రాష్ట్రంలోని రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

గతంలో అధిక టారిఫ్‌ల కారణంగా తగ్గిన ఎగుమతులు మళ్లీ పుంజుకుంటాయని, అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వం పెరుగుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో విధించిన 25 శాతం టారిఫ్‌కు అదనంగా ప్రతీకార సుంకాలు విధించడంతో మొత్తం భారం 50 నుంచి 58 శాతానికి చేరింది. దీని ఫలితంగా, 2025 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో అమెరికాకు మన దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పరిమాణంలో సుమారు 15 శాతం తగ్గి 2.01 లక్షల టన్నులకు, విలువలో 6.3 శాతం తగ్గి 1.72 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ముఖ్యంగా, ప్రధాన ఎగుమతి అయిన రొయ్యలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.

 

 

 

తాజా టారిఫ్ తగ్గింపుతో అమెరికా మార్కెట్లో భారత సముద్ర ఉత్పత్తుల పోటీతత్వం గణనీయంగా మెరుగుపడుతుందని, నిలిచిపోయిన ఎగుమతి ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతాయని అచ్చెన్నాయుడు వివరించారు. రాబోయే నెలల్లో అమెరికాకు సీఫుడ్ ఎగుమతులు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉందని, 2025-26 ద్వితీయార్థంలో ఎగుమతులు మునుపటి స్థాయికి చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ పరిణామంతో సీఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లాభాల మార్జిన్లు కూడా మెరుగుపడతాయని తెలిపారు. అధిక టారిఫ్ సమయంలో 5-5.5 శాతానికి పడిపోయిన ప్రాసెసర్ల మార్జిన్లు, ఇప్పుడు తిరిగి 7-8 శాతం స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

 

 

అమెరికా మార్కెట్ పునరుద్ధరణతో పాటు, యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి ఇతర మార్కెట్లకు కూడా ఎగుమతులు నిలకడగా కొనసాగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2026లో సీఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్‌లపై అందించిన సుంకాల రాయితీలు ఈ రంగానికి అదనపు బలంగా నిలుస్తాయని ఆయన గుర్తుచేశారు. 

 

దేశవ్యాప్తంగా 2025-26లో మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 14-15 లక్షల టన్నులకు చేరుకోవచ్చని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (MPEDA) అంచనాలను ఆయన ప్రస్తావించారు. ఈ టారిఫ్ తగ్గింపు దేశంలోనే సీఫుడ్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఖగోళంలో బ్లడ్ మూన్ అరుదైన దృశ్యం
మార్చ్ మూడో అరుదైన చంద్రగ్రహణం మూడున్నర గంటలకు ఆకాశంలో కనువిందు చేయనుంది భూమి నీడను చంద్రుడు...
By Rajini Kumari 2026-03-03 10:09:31 0 109
Telangana
చందానగర్ లో 19 ఏళ్ల విద్యార్థిని అదృశ్యం
మొయినాబాద్:మొయినాబాద్ మండలంలోని చందానగర్ గ్రామ నివాసి తోక బార్గవి (19), విద్యార్థిని అదృశ్యమైంది....
By Veeresh Kumar 2026-04-01 04:50:33 0 360
Andhra Pradesh
మార్కాపురం జిల్లా.... తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ని స్వచ్చందంగా పంపిణి చేసిన SEVAస్వచ్చంద సంస్థ
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో 120 మంది విద్యార్థులకు పరీక్ష...
By Chennaiah Kati 2026-03-10 11:02:11 0 333
Andhra Pradesh
ఆటోని కారు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు మృతి
ఆటోని కారు ఢీకొన్న సంఘటనలో మహిళతో సహా ఇరువురి మృతి.. నందిగామ ఎన్టీఆర్ జిల్లా  ఆటోని కారు...
By Patan Khuddus 2026-04-25 11:11:48 0 224
Andhra Pradesh
మదనపల్లి: పోలీస్‌ భవన నిర్మాణాలకు రూ. 10 లక్షల విరాళం.
అన్నమయ్య జిల్లా పోలీస్ భవన నిర్మాణాల కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త, రియల్టర్ టి. కృష్ణప్ప నాయుడు...
By Pagadala Venkateswar 2026-02-24 07:55:31 0 126
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com