Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు.

0
37

Achchennaidu: అమెరికాతో ట్రేడ్ డీల్ ఏపీ ఆక్వా రంగానికి ఒక వరం: మంత్రి అచ్చెన్నాయుడు

03-02-2026 Tue 21:46 | Andhra

Achchennaidu welcomes US trade deal boost for AP aqua sector

భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్‌ల తగ్గింపు

ఏపీ ఆక్వా రైతులకు ఇది శుభవార్త అన్న మంత్రి అచ్చెన్నాయుడు

25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిన సుంకం

10 నుంచి 15 శాతం పెరగనున్న సీఫుడ్ ఎగుమతులు

 

రైతులు, మత్స్యకారుల ఆదాయం పెరుగుతుందని అంచనా

 

భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం టారిఫ్‌లను తగ్గించడాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఆక్వాకల్చర్ రంగానికి గణనీయమైన ఊరటనిస్తుందని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కింద టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడం, ఆక్వా రంగంలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఒక వరం లాంటిదని ఆయన అభివర్ణించారు. దీనివల్ల రాష్ట్రంలోని రైతులు, మత్స్యకారులకు ఆదాయ స్థిరత్వం పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

గతంలో అధిక టారిఫ్‌ల కారణంగా తగ్గిన ఎగుమతులు మళ్లీ పుంజుకుంటాయని, అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వం పెరుగుతుందని అచ్చెన్నాయుడు అన్నారు. గతంలో విధించిన 25 శాతం టారిఫ్‌కు అదనంగా ప్రతీకార సుంకాలు విధించడంతో మొత్తం భారం 50 నుంచి 58 శాతానికి చేరింది. దీని ఫలితంగా, 2025 ఏప్రిల్-నవంబర్ మధ్య కాలంలో అమెరికాకు మన దేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు పరిమాణంలో సుమారు 15 శాతం తగ్గి 2.01 లక్షల టన్నులకు, విలువలో 6.3 శాతం తగ్గి 1.72 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ముఖ్యంగా, ప్రధాన ఎగుమతి అయిన రొయ్యలపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.

 

 

 

తాజా టారిఫ్ తగ్గింపుతో అమెరికా మార్కెట్లో భారత సముద్ర ఉత్పత్తుల పోటీతత్వం గణనీయంగా మెరుగుపడుతుందని, నిలిచిపోయిన ఎగుమతి ఆర్డర్లు తిరిగి ప్రారంభమవుతాయని అచ్చెన్నాయుడు వివరించారు. రాబోయే నెలల్లో అమెరికాకు సీఫుడ్ ఎగుమతులు 10 నుంచి 15 శాతం పెరిగే అవకాశం ఉందని, 2025-26 ద్వితీయార్థంలో ఎగుమతులు మునుపటి స్థాయికి చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ పరిణామంతో సీఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో లాభాల మార్జిన్లు కూడా మెరుగుపడతాయని తెలిపారు. అధిక టారిఫ్ సమయంలో 5-5.5 శాతానికి పడిపోయిన ప్రాసెసర్ల మార్జిన్లు, ఇప్పుడు తిరిగి 7-8 శాతం స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 

 

 

అమెరికా మార్కెట్ పునరుద్ధరణతో పాటు, యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి ఇతర మార్కెట్లకు కూడా ఎగుమతులు నిలకడగా కొనసాగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2026లో సీఫుడ్ ప్రాసెసింగ్‌కు అవసరమైన ఇన్‌పుట్‌లపై అందించిన సుంకాల రాయితీలు ఈ రంగానికి అదనపు బలంగా నిలుస్తాయని ఆయన గుర్తుచేశారు. 

 

దేశవ్యాప్తంగా 2025-26లో మొత్తం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 14-15 లక్షల టన్నులకు చేరుకోవచ్చని మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (MPEDA) అంచనాలను ఆయన ప్రస్తావించారు. ఈ టారిఫ్ తగ్గింపు దేశంలోనే సీఫుడ్ ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో మేలు చేస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు కార్యక్రమాలకు ఇవ్వకూడదని క్రీడాకారుల నిరసన
ప్రచురణార్థం 14/12/25 సింగ్ నగర్    మాకినేని బసవ పున్నయ్య స్టేడియాన్ని ప్రైవేటు...
By Rajini Kumari 2025-12-15 08:04:44 0 121
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 114
Andhra Pradesh
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కాలువల సమస్య
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం ఎస్సీ కాలనీ మాల కాలవల సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలు...
By Chennaiah Kati 2025-12-22 07:45:18 0 381
Nagaland
Assam Rifles Public School Hosts Friendly Football Match in Medziphem |
Assam Rifles Public School, Medziphema, organized a friendly football match with SFS Higher...
By Pooja Patil 2025-09-16 06:48:20 0 125
Andhra Pradesh
TDP మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘన నివాళి
వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చిన భారత రైతు బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్   టిడిపి...
By Rajini Kumari 2025-12-23 10:27:53 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com