మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Posted 2026-02-04 07:42:46
0
284
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం వద్ద నామినేషన్ల ఉపసంహరణ గడువు సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కృపానందాన్ని కాంగ్రెస్ నాయకులు కార్యాలయానికి తీసుకెళ్లడంతో బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసినా లోనికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మీడియా మూగబోయిందా?🌟ప్రశ్నించని వ్యవస్థ. కలం గళం ఎటువైపు?
మీడియా అంటే ప్రజల గొంతు, బాధను వినిపించే వేదిక, ప్రశ్నించే ధైర్యం. సామాన్యుడి సమస్య...
మదనపల్లె: రోడ్డు ప్రమాదం కడప డ్రైవర్ మృతి
మదనపల్లెలో శుక్రవారం వేకువ జామున రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా లింగాలకు చెందిన రాజా (30),...
పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య...
Rajasthan Advances Business-Friendly Reforms
The Rajasthan Government is advancing business-friendly reforms through simplified regulations,...
పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన...