Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ... ఒకటి, రెండు గంటల్లోనే శీఘ్ర దర్శనం.

0
301

టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం టోకెన్లు లేకపోయినా 5 - 6 గంటల్లో స్వామి వారి దర్శనం అయిపోతోంది. రూ. 300ల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. 

 

నిన్న శ్రీవారిని 69,389 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.72 కోట్ల ఆదాయం వచ్చింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీవిరూపాక్షి మారెమ్మ తల్లికి పంచామృతాలతో అభిషేకం
పుంగనూరు పట్టణంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లికి అర్చక...
By Kothuru Murali 2026-06-02 15:29:02 0 87
Andhra Pradesh
ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం
*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*   *జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు...
By Rajini Kumari 2025-12-26 09:41:50 0 219
Andhra Pradesh
పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ
అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య...
By Kothuru Murali 2026-07-11 15:53:12 0 82
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్లో తగ్గిన టమాటా ధరలు.
ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన...
By Pagadala Venkateswar 2026-02-27 09:07:40 0 144
Telangana
సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు...
దిల్సుఖ్ నగర్ లో మల్కాజ్గిరి సీపీ సుమతీ ఐపీఎస్ స్పెషల్ ఆపరేషన్. అర్ధరాత్రుళ్లు మహిళల పరిస్థితిని...
By Ponnala Srinivasrao 2026-05-07 01:59:17 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com