సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

0
165

సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను సన్మానించి అత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు

👉ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ గారు

పోలీసు శాఖలో విశేష సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ తుమ్మల సింగయ్య HC.1906, 36 సర్వీస్ శనివారం ఎస్పీ గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. 

జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, కఠిన పరిస్థితులు ఎదుర్కొంటూ పోలీసు ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. పోలీసు విధుల నిర్వహణలో కుటుంబానికి దూరంగా ఉంటూ విధులపట్ల అంకితభావంతో పనిచేశారన్నారు.జిల్లా పోలీస్ శాఖకు వారు అందించిన సేవలను శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, గతంలో వారు క్యాష్ రివార్డ్స్–20, జీఎస్‌ఈ–50, సేవాపతకం–1 పొందివున్నారు. పోలీసు ఉద్యోగంలో సేవలందించేందుకు సహాయ సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకు జిల్లా పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వారి పట్ల ప్రేమ, ఆప్యాయతతో ఉండాలని సూచించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. విరమణ అనంతరం ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, పోలీసు శాఖ ఎల్లవేళలా వారికి తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో ఎఆర్ఎస్సై తిరుపతి స్వామి, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు
*పత్రికా ప్రకటన*   *విజయవాడ, తేదీ: 19.01.2026*   *• ఏపీ మెడికల్ కౌన్సిల్ లో...
By Rajini Kumari 2026-01-19 11:23:45 0 97
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆల్వాల్‌లో HPV వ్యాక్సిన్ ప్రారంభం.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య...
By Sidhu Maroju 2026-03-30 09:53:14 0 65
Andhra Pradesh
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven children in two separate incidents that occurred on Sunday
Chief Minister N. Chandrababu Naidu expressed profound sorrow over the tragic deaths of seven...
By BMA ADMIN 2025-05-19 11:51:46 0 2K
Telangana
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి...
By Sidhu Maroju 2026-03-27 11:33:16 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com