మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం

0
176

కృష్ణా జిల్లా పోలీస్ 

 

*మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక ద్రవ్యాల పై అవగాహన కల్పిస్తున్న కృష్ణాజిల్లా పోలీసులు.*

 

మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది, శక్తి టీం మరియు ఈగల్ టీం సభ్యుల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో గల విజయానంద డిగ్రీ కాలేజీ నందు విద్యార్థినీ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వ్యసనం, సైబర్ క్రైమ్, పోక్సో చట్టం, శక్తి యాప్ యొక్క ఆవశ్యకత మరియు ట్రాఫిక్ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.

 

 మాదక ద్రవ్యాల వలన శారీరక, మానసిక మరియు సామాజికంగా కలిగే తీవ్రమైన దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పించబడింది.

 

అదనంగా సురక్షితమైన ఇంటర్నెట్ వినియోగం, అనుమానాస్పద లింకులు, ఫేక్ అకౌంట్లు, ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలు తెలియజేశారు.

 

పిల్లల రక్షణ కోసం అమలులో ఉన్న పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, చట్టపరమైన రక్షణలు మరియు సహాయ మార్గాల గురించి కూడా విద్యార్థులకు తెలియజేయబడింది.

 

ప్రతి ఒక్కరు శక్తి యాప్ను కలిగి ఉండాలని దాని యొక్క వినియోగం మరియు ఆవశ్యకతల గురించి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగినది.

 

రహదారి భద్రత నియమాలు పాటించడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించవచ్చని తెలియజేయడం జరిగినది.

 

కార్యక్రమం మొత్తం సమయంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతో, ఈ అవగాహన కార్యక్రమం వారి భద్రత, బాధ్యత మరియు చట్టపరమైన అవగాహనను పెంపొందించే దిశగా ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ భేటీ.. 'సూరత్ నమూనా'పై కీలక చర్చ!
సీఆర్ పాటిల్ తో పవన్ కల్యాణ్ భేటీ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీరలేదని చెప్పిన...
By Pagadala Venkateswar 2026-06-16 13:29:36 0 61
Telangana
ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తేనే ప్రమాదాలను తగ్గించి సురక్షిత, రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చు : పెద్దపెల్లి డిసిపి రామ్ రెడ్డి
రామగుండం : వాహనదారులు సురక్షిత ప్రయాణం తో ప్రాణాలతో ఇంటికి చేరుకోవాలి అని రోడ్డు భద్రతపై పోలీసుల...
By Avunoori Mahesh 2026-04-13 14:48:12 0 178
Andhra Pradesh
వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి
బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ రైల్వే గేటు వద్ద వందేభారత్ రైలు ఢీకొని గుర్తు తెలియని...
By Boiena Rajesh 2026-04-13 13:40:31 0 154
Andhra Pradesh
వైయస్ షర్మిల రెడ్డి రెండేళ్లు కావస్తున్న మహా శక్తి పథకం అమలులో లేదు
SCROLL   విజయవాడ    *వైఎస్ షర్మిలా రెడ్డి* APCC చీఫ్    -...
By Rajini Kumari 2026-01-13 16:35:40 0 182
Goa
Goa’s Sky-High Marvel: Zuari Bridge Towers Ready for Takeoff
Panaji: A transformative milestone is approaching for Goa’s tourism landscape. Final...
By Dunna Jessicaruth 2026-05-14 07:01:06 0 81
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com