మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

0
218

పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైనటువంటి *మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం, పాడి, పంట సమృద్ధిగా ఉంటేనే రైతు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి.

 కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మినీ గోకులం (పశువుల షెడ్డు) లను పూర్తిగా 100% MGNRGS నిధుల నుండి 25మంది లబ్దిదారులకు 4954000/- రూపాయల వరకు నిధులు మంజూరు చేయటం జరిగింది. పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హతగల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, పొన్నూరు నియోజకవర్గ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ్లమూడి బాబురావు, గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చలమశెట్టి సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లూరి వెంకట అప్పారావు, దేశం శెట్టి సూర్య,MPDO గుమ్మడి చంద్రశేఖర రావు, APO సుభాషిణి, APM జోజి బాబు, EOPRD శ్రీనివాస రావు, వివిధ గ్రామాల కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: ఘాట్ రోడ్లో పల్టీలు కొట్టిన కారు
పులిచెర్ల మండలంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొద్దుటూరు పట్టణానికి చెందిన సరస్వతమ్మ,...
By Kothuru Murali 2026-04-16 17:11:02 0 75
Andhra Pradesh
Anna Canteen: పేదలకు శుభవార్త.. ఇక గ్రామాల్లో అన్న క్యాంటీన్లు.. సంక్రాంతి నుంచి ప్రారంభం
Anna Canteen: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో అన్న క్యాంటీన్లు...
By Siva Bhaskar 2025-12-25 02:22:39 1 634
Telangana
జాతీయస్థాయిలో వేములవాడ ఉపాధ్యాయురాలు ప్రతిభ
భారతి ఎయిర్‌టెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఉపాధ్యాయుల టీఎల్‌ఎం...
By Kodam Prasad 2026-04-10 01:44:44 0 177
Telangana
"ఆపరేషన్ సేఫ్ స్కూల్… హైదరాబాద్‌లో 558 దుకాణాలపై సజ్జనార్ భారీ దాడులు”
హైదరాబాద్ : నగరంలో స్కూల్ పరిసరాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు...
By Sidhu Maroju 2026-04-18 17:36:42 0 510
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com