మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

0
220

పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైనటువంటి *మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం, పాడి, పంట సమృద్ధిగా ఉంటేనే రైతు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి.

 కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మినీ గోకులం (పశువుల షెడ్డు) లను పూర్తిగా 100% MGNRGS నిధుల నుండి 25మంది లబ్దిదారులకు 4954000/- రూపాయల వరకు నిధులు మంజూరు చేయటం జరిగింది. పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హతగల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, పొన్నూరు నియోజకవర్గ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ్లమూడి బాబురావు, గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చలమశెట్టి సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లూరి వెంకట అప్పారావు, దేశం శెట్టి సూర్య,MPDO గుమ్మడి చంద్రశేఖర రావు, APO సుభాషిణి, APM జోజి బాబు, EOPRD శ్రీనివాస రావు, వివిధ గ్రామాల కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
దారుణంగా మరణం....
మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ పట్టణ శివారులో దారుణ ఘటన చోటుచేసుకుంది. అమపురం గ్రామానికి చెందిన...
By Gujile Ramu 2026-04-28 07:00:56 0 205
Telangana
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు
నేటి నుంచి పాన్ కార్డ్స్‌ రూల్స్‌ మార్పు దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచే...
By Pinnehasan Odela 2026-04-01 07:09:46 0 125
Andhra Pradesh
పుంగనూరు:సుగుటూరు గంగమ్మ వీడియో వైరల్
పుంగనూరు చరిత్ర, శ్రీసుగుటూరు గంగమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఓ వీడియోను సినీ నటుడు సప్తగిరి...
By Kothuru Murali 2026-02-22 09:52:50 0 114
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 108
Andhra Pradesh
సీఎం క్యాంప్ కార్యాలయంలో డైన మాటిక్ ప్రతినిధులు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
By Rajini Kumari 2026-02-23 10:35:40 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com