మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్.

0
223

పొన్నూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ (MPDO) కార్యాలయం నందు పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైనటువంటి *మినీ గోకులం (పశువుల షెడ్డు) శాంక్షన్ ఆర్డర్ కాపీలను లబ్దిదారులకు అందచేసిన మన ప్రియతమ నాయకులు పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు 

ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు వారు మాట్లాడుతూ ఈ ప్రాంతం రైతాంగం ఎక్కువగా ఉండే ప్రాంతం, పాడి, పంట సమృద్ధిగా ఉంటేనే రైతు బాగుంటారు, రైతు బాగుంటేనే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రాలు, దేశాలు బాగుంటాయి.

 కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ మినీ గోకులం (పశువుల షెడ్డు) లను పూర్తిగా 100% MGNRGS నిధుల నుండి 25మంది లబ్దిదారులకు 4954000/- రూపాయల వరకు నిధులు మంజూరు చేయటం జరిగింది. పొన్నూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హతగల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందచేయటం జరిగింది.

ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు, పొన్నూరు నియోజకవర్గ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ మాదాల వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బండ్లమూడి బాబురావు, గుంటూరు పార్లమెంట్ రైతు విభాగ ప్రధాన కార్యదర్శి బొర్రు రామారావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చలమశెట్టి సీతారామయ్య, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తాళ్లూరి వెంకట అప్పారావు, దేశం శెట్టి సూర్య,MPDO గుమ్మడి చంద్రశేఖర రావు, APO సుభాషిణి, APM జోజి బాబు, EOPRD శ్రీనివాస రావు, వివిధ గ్రామాల కూటమి నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Pattadar passbook distribution in vemuru
వేమూరు నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబుగారు...   వేమూరు...
By G k Nookala 2026-04-08 17:29:18 0 133
Telangana
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)...
By Sidhu Maroju 2026-03-17 07:25:04 0 157
Andhra Pradesh
కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి...
By Pagadala Venkateswar 2026-04-18 04:04:57 0 71
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాలల్లో వేకెన్సీ బోర్డులు పెట్టాలి మంత్రి నారా లోకేష్ ఆకాంక్ష
ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు పెట్టాలి.   అదే మంత్రి నారా లోకేష్ గారి ఆకాంక్ష....
By Rajini Kumari 2026-04-20 14:24:05 0 81
Telangana
సుప్రీంకోర్టు న్యాయవాది మీద పగ తీర్చుకున్నా హైడ్రా కమిషనర్‌ ?
సుప్రీంకోర్టు న్యాయవాది మీద హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ పగ తీర్చుకున్నారంటూ...
By Ponnala Srinivasrao 2026-04-14 01:32:55 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com