Botsa Satyanarayana: రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలనుకుంటున్నారా?: బొత్స ఘాటు వ్యాఖ్యలు.

0
146

అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిపై తీవ్రంగా స్పందించిన బొత్స సత్యనారాయణ

 

పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అన్న బొత్స

చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని సూచన

రాష్ట్రాన్ని రావణకాష్ఠంగా చేయాలనుకుంటున్నారా? అంటూ ఏపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దగ్గరుండి దాడి చేయిస్తారా? వైసీపీకి కార్యకర్తలు లేరని అనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. 

 

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ .. చంద్రబాబు నాయుడు అప్రతిష్టను మూటకట్టుకోవద్దని హితవు పలికారు. గత మూడు రోజులుగా కూటమి ప్రభుత్వం విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో జనసేన, బీజేపీ నాయకులు ఎందుకు తప్పును తప్పు అని చెప్పడం లేదని బొత్స నిలదీశారు. తనను దుర్భాషలాడటం వల్లే రాంబాబు స్పందించారని తెలిపారు. అనంతరం ఇంటికి వచ్చి తాను మాట్లాడింది తప్పేనని అంగీకరించారని, అయినా కేంద్ర మంత్రి తడాఖా చూపిస్తామని మాట్లాడటం సరికాదన్నారు. 

 

ఎన్‌డీడీబీ రిపోర్ట్‌ను వైసీపీ తెచ్చిందా? అని బొత్స ప్రశ్నించారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం న్యాయమా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని దేవుడు కూడా క్షమించడని, ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందేనని అన్నారు. అంబటి ఇంటిపై పెట్రోల్‌ బాంబులు వేసి చంపాలనుకుంటున్నారా? అంటూ బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వ తీరుపై ప్రజలే ఆలోచన చేయాలని బొత్స కోరారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
పదవి విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడుకోలు
*ఎన్. టి. ఆర్ .జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయం, ఎన్. టి. ఆర్. జిల్లా.*   *పత్రికా...
By Rajini Kumari 2026-05-30 12:16:05 0 119
Andhra Pradesh
మదనపల్లెలో బాలికపై హత్యాచారం.. A2 ఇంటి వద్ద పహారా.
మదనపల్లెలో బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఏ2 నిందితురాలు తలారి అంజలి ఇంటి వద్ద పోలీసులు పటిష్ఠ...
By Pagadala Venkateswar 2026-02-20 08:28:59 0 143
Telangana
ఆసిఫాబాద్‌లో వర్షాకాలం ముందస్తు చర్యలు ముమ్మరం: డ్రైనేజీల క్లీనింగ్
🎤కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ : ఆసిఫాబాద్: త్వరలో వర్షాకాలం...
By Chunarkar Jagadeesh 2026-05-31 03:56:07 0 629
Andhra Pradesh
Chandrababu Naidu: శివరాత్రి నేపథ్యంలో... ఏపీలోని శైవక్షేత్రాలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న సీఎం చంద్రబాబు దేవాదాయశాఖ...
By Pagadala Venkateswar 2026-02-11 07:47:48 0 152
Andhra Pradesh
యోగా వలన శారీరక దృఢత్వం, మానసిక స్థిరత్వం, ఆలోచనా సామర్థ్యం పెరుగుతాయి – గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు .
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం...
By John Baji 2026-02-04 13:00:17 0 467
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com