Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ

0
150

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం

వివిధ కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్న కేబినెట్

 

తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు. 

 

సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, సంక్షేమ పథకాల అమలు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులు, పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గత కేబినెట్‌లో 30కి పైగా అంశాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా, వారం రోజుల్లోనే మరోసారి సమావేశం కావడంతో ఈసారి కూడా ఎజెండా 30కి పైగా అంశాలు ఉండొచ్చని అంచనా. 

 

కేబినెట్‌ సమావేశం ఎజెండా పూర్తయిన అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగే అవకాశముంది. ప్రధానంగా తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఇతర అంశాలు, అంబటి రాంబాబు, జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నేతలకు సూచించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ,...
By John Baji 2026-01-06 12:35:52 0 195
Andhra Pradesh
రోడ్డు ప్రమాదంలో యువ అధ్యాపకుని దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువ అధ్యాపకుడు మృతి చెందిన విషాద...
By Ratna Sekhar 2026-02-19 20:22:18 0 1K
Andhra Pradesh
వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదగాలి: ఏపీసీ అనురాధ.
మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన 'ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్ డెవలప్మెంట్' జిల్లా...
By Pagadala Venkateswar 2026-04-09 04:39:07 0 137
SURAKSHA
అతరరాజ్ సాయిబర్ నెట్‌వర్క్ కా భండాఫోడ్: పులిస్ నే కియా బడా ఖులాసా
ఇటీవల పోలీసులు ఒక భారీ అంతర్రాష్ట్ర సైబర్ నెట్‌వర్క్‌ను ఛేదించి, కీలక సభ్యులను అరెస్టు...
By Kalaga Sailaja 2026-06-24 12:07:00 0 83
SURAKSHA
Biju George Joseph: Strengthening Law and Order
A distinguished 1995-batch Rajasthan Cadre IPS officer, Biju George Joseph has earned widespread...
By Lokeshwari Panthadi 2026-07-23 10:40:21 0 51
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com