TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.

0
142

TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు

02-02-2026 Mon 14:17 | Andhra

TDP Leaders Palla Srinivasa Rao and Atchannaidu issue directives to party cadre

టీడీపీ శ్రేణులు చట్టాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని స్పష్టమైన ఆదేశాలు

 

దాడులు, హింస టీడీపీ సంస్కృతి కాదని తెలిపిన నేతలు

వైసీపీ ఉచ్చులో పడకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపు

కేంద్ర బడ్జెట్‌లోని కేటాయింపులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచన

తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని భరోసా

టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాడులు, ప్రతిదాడులు మన సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

 

టెలికాన్ఫరెన్స్‌లో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవలి పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. "గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగించిన అరాచకాలను మనం వ్యతిరేకించాం. ఇప్పుడు మనమే అలా ప్రవర్తించడం సరికాదు. సోషల్ మీడియాలోని ప్రేరణలకు లోనై స్పందించవద్దు. చట్టాన్ని గౌరవించడమే మన పార్టీ బ్రాండ్ ఇమేజ్" అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి లభించిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతికి రూ.1,088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.500 కోట్లు కేటాయించడం వంటి అంశాలను వివరించాలని కోరారు.

 

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. "టీడీపీని రాజకీయంగా అంతం చేయాలనే దురుద్దేశంతో కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైలుకు పంపినా పార్టీ వెనక్కి తగ్గలేదు. ప్రజలు మనపై నమ్మకంతో అధికారం ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది" అని అన్నారు. చంద్రబాబు అనుభవం, ప్రధాని మోదీ సహకారంతో కేవలం 20 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమన్న ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడం, అమరావతి నిర్మాణం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో అంబటి రాంబాబు దిష్టిబొమ్మ దగ్ధం
అన్నమయ్య జిల్లా, పుంగునూరు పట్టణంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాజీ మంత్రి అంబటి రాంబాబు...
By Kothuru Murali 2026-02-01 09:51:15 0 200
West Bengal
West Bengal Strengthens Sports Development Across State
West Bengal is expanding its sports ecosystem through investments in modern infrastructure,...
By Fathima Safa 2026-07-02 05:48:15 0 52
Telangana
"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’...
By Sidhu Maroju 2026-04-17 09:00:40 0 232
Telangana
"ఖరీదైన దాహం"... వృద్ధురాలి గొలుసు లాక్కెళ్ళిన కేటుగాడు కటకటాల్లోకి..|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మంచినీళ్ల పేరుతో నమ్మించి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు...
By Sidhu Maroju 2026-02-13 15:31:33 0 206
SURAKSHA
రోడ్డు ద్రతభ - ట్రాఫిక్ క్రమబద్ధీకరణ
మాజాన్ని పట్టి పీడిస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరాను అరికట్టడానికి పోలీసులు 'ఆపరేషన్...
By Kalaga Sailaja 2026-06-29 08:05:33 0 70
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com