TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.

0
143

TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు

02-02-2026 Mon 14:17 | Andhra

TDP Leaders Palla Srinivasa Rao and Atchannaidu issue directives to party cadre

టీడీపీ శ్రేణులు చట్టాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని స్పష్టమైన ఆదేశాలు

 

దాడులు, హింస టీడీపీ సంస్కృతి కాదని తెలిపిన నేతలు

వైసీపీ ఉచ్చులో పడకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపు

కేంద్ర బడ్జెట్‌లోని కేటాయింపులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచన

తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని భరోసా

టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాడులు, ప్రతిదాడులు మన సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

 

టెలికాన్ఫరెన్స్‌లో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవలి పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. "గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగించిన అరాచకాలను మనం వ్యతిరేకించాం. ఇప్పుడు మనమే అలా ప్రవర్తించడం సరికాదు. సోషల్ మీడియాలోని ప్రేరణలకు లోనై స్పందించవద్దు. చట్టాన్ని గౌరవించడమే మన పార్టీ బ్రాండ్ ఇమేజ్" అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి లభించిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతికి రూ.1,088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.500 కోట్లు కేటాయించడం వంటి అంశాలను వివరించాలని కోరారు.

 

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. "టీడీపీని రాజకీయంగా అంతం చేయాలనే దురుద్దేశంతో కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైలుకు పంపినా పార్టీ వెనక్కి తగ్గలేదు. ప్రజలు మనపై నమ్మకంతో అధికారం ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది" అని అన్నారు. చంద్రబాబు అనుభవం, ప్రధాని మోదీ సహకారంతో కేవలం 20 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమన్న ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడం, అమరావతి నిర్మాణం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
అంతర్జాతీయ వేదికలపై భారత మీడియా స్వేచ్ఛ సవాల్
ఇటీవలి నార్డిక్ దేశాల పర్యటనలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించినప్పటికీ, నార్వే ప్రెస్...
By Hazu MD. 2026-05-20 08:43:14 0 280
Business & Finance
Late Team Loan Repayments Can Lead to Serious Legal Action
Failing to repay a loan on time can result in serious legal and financial consequences for both...
By Navya Sree 2026-07-11 06:47:09 0 74
Himachal Pradesh
Himachal Pradesh Expands Digital Governance Services
Himachal Pradesh is steadily advancing digital governance to improve transparency, efficiency,...
By Fathima Safa 2026-06-29 12:21:16 0 99
Andhra Pradesh
వజ్రాలు, బంగారం పేరిట భారీ మోసం, అత్యాశ చూపించి మహిళా దగ్గర్నుంచి ఐదు లక్షల కాజేసిన కేటుగాడు
  నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ లో రూ.5 లక్షలు కాజేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి... కేసు...
By Patan Khuddus 2026-04-17 07:33:33 0 233
Andhra Pradesh
మదనపల్లె వన్‌టౌన్ ఎస్సైగా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకరణ.
మదనపల్లె ఒకటవ పట్టణ రెండో ఎస్సైగా సి. చంద్రశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో అన్సర్ బాష...
By Pagadala Venkateswar 2026-04-08 13:57:01 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com