TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు.

0
78

TDP: చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. టీడీపీ శ్రేణులకు పల్లా, అచ్చెన్న కీలక ఆదేశాలు

02-02-2026 Mon 14:17 | Andhra

TDP Leaders Palla Srinivasa Rao and Atchannaidu issue directives to party cadre

టీడీపీ శ్రేణులు చట్టాన్ని గౌరవించాలని, సంయమనం పాటించాలని స్పష్టమైన ఆదేశాలు

 

దాడులు, హింస టీడీపీ సంస్కృతి కాదని తెలిపిన నేతలు

వైసీపీ ఉచ్చులో పడకుండా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కార్యకర్తలకు పిలుపు

కేంద్ర బడ్జెట్‌లోని కేటాయింపులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచన

తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని భరోసా

టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దాడులు, ప్రతిదాడులు మన సంస్కృతి కాదని, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.

 

టెలికాన్ఫరెన్స్‌లో పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవలి పరిణామాలపై చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. "గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాగించిన అరాచకాలను మనం వ్యతిరేకించాం. ఇప్పుడు మనమే అలా ప్రవర్తించడం సరికాదు. సోషల్ మీడియాలోని ప్రేరణలకు లోనై స్పందించవద్దు. చట్టాన్ని గౌరవించడమే మన పార్టీ బ్రాండ్ ఇమేజ్" అని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి లభించిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అమరావతికి రూ.1,088 కోట్లు, పట్టణాభివృద్ధికి రూ.452 కోట్లు, గ్రామీణ రహదారులకు రూ.500 కోట్లు కేటాయించడం వంటి అంశాలను వివరించాలని కోరారు.

 

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... గత ఐదేళ్లలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. "టీడీపీని రాజకీయంగా అంతం చేయాలనే దురుద్దేశంతో కేసులు పెట్టి, చంద్రబాబు గారిని జైలుకు పంపినా పార్టీ వెనక్కి తగ్గలేదు. ప్రజలు మనపై నమ్మకంతో అధికారం ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది" అని అన్నారు. చంద్రబాబు అనుభవం, ప్రధాని మోదీ సహకారంతో కేవలం 20 నెలల్లోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలమన్న ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయడం, అమరావతి నిర్మాణం, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలోకి చేరికలు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, చీకల చేను గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం...
By Kothuru Murali 2026-03-06 11:26:17 0 81
Andhra Pradesh
Chandrababu Naidu: ప్రపంచ క్లీన్ ఎనర్జీలో ఏపీకి అగ్రస్థానం: సీఎం చంద్రబాబు
Andhra   Chandrababu Naidu AP to Become Global Clean Energy Hub కాకినాడలో ఏఎం గ్రీన్...
By Pagadala Venkateswar 2026-01-17 11:13:38 0 116
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం కొత్తూరు మురళి: తప్పిన పెను ప్రమాదం
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదం మంగళవారం వెలుగులోకి వచ్చింది....
By Kothuru Murali 2026-03-24 13:28:55 0 79
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com