Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు.

0
113

 

Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు

01-02-2026 Sun 18:13 | Andhra

Chandrababu Naidu Praises Union Budget as Boon for AP Development

హైస్పీడ్ రైల్ కారిడార్లు, డేటా సెంటర్ల ఏర్పాటు రాష్ట్రానికి మేలు చేస్తుందని వెల్లడి

 

టెక్నాలజీ, పరిశ్రమలు, పర్యాటక రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత లభించిందన్న సీఎం

రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు కేంద్ర బడ్జెట్ సహకరించేలా ఉందని హర్షం

2047 నాటి వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంస

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన 'ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని, ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. కుప్పంలో ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందిస్తూ, ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, అభివృద్ధి ప్రణాళికలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈల బలోపేతానికి తాము ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా కేంద్రం 75 శాతం క్రెడిట్ గ్యారెంటీ ఇవ్వడం, రాష్ట్రం తరఫున మరో 20 శాతం అందిస్తుండటంతో ఈ రంగానికి భరోసా లభిస్తుందని తెలిపారు. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా ఈ బడ్జెట్ ఉందని, ఇది 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత్ భారత్’గా, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు బలమైన పునాది వేస్తుందని అన్నారు. ఆర్థిక మంత్రి సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని, దేశానికి సరైన దిశానిర్దేశం చేసేలా ఉందని కొనియాడారు.

 

రవాణా, టెక్నాలజీ రంగాలకు పెద్దపీట

 

ఈ బడ్జెట్‌లో ప్రకటించిన మూడు కీలకమైన హైస్పీడ్ రైల్ కారిడార్లు (హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, బెంగళూరు-చెన్నై) ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా అమరావతి, తిరుపతి, పలమనేరు, చిత్తూరు వంటి కీలక ప్రాంతాలు అనుసంధానమవుతాయని తెలిపారు. 

 

అలాగే, రాష్ట్రంలో ఉన్న ‘రేర్ ఎర్త్ కారిడార్’ ద్వారా విలువైన ఖనిజాలను వెలికితీసి, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్ తయారీకి మార్గం సుగమం అవుతుందన్నారు. ఐఎస్ఎం 2.0 కింద సెమీకండక్టర్ల కోసం రూ.40 వేల కోట్లు, టెక్స్‌టైల్ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

 

డేటా సెంటర్లకు 2047 వరకు పన్ను మినహాయింపులు ఇవ్వడం ఒక చారిత్రక నిర్ణయమని చంద్రబాబు అన్నారు. దీనివల్ల భారత్ గ్లోబల్ డేటా హబ్‌గా మారుతుందని, ఇప్పటికే విశాఖకు గూగుల్ వంటి సంస్థలు వస్తున్నాయని గుర్తుచేశారు. ఈ డేటా సెంటర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అభివృద్ధికి ఊతమిచ్చి, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో బిల్ గేట్స్ కూడా అమరావతిలో పర్యటించనున్నారని, ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి నెక్స్ట్ జెన్ టెక్నాలజీలకు ఏపీ చిరునామాగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 

పర్యాటకం, వ్యవసాయ రంగాలకు ఊతం

 

కేంద్ర బడ్జెట్‌లో అరకు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశాన్ని చేర్చడం హర్షణీయమని సీఎం అన్నారు. దీంతోపాటు పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించడం వల్ల ఫ్లెమింగో వంటి అరుదైన పక్షుల సంరక్షణకు, పర్యాటక వృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈస్ట్ కోస్ట్ కారిడార్, అంతర్గత జలరవాణాకు నిధులు కేటాయించడం ద్వారా రాష్ట్రంలోని వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం లాజిస్టిక్స్ పరంగా గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. 

 

కొబ్బరి, జీడి, కోకో, చందనం వంటి ఉద్యాన పంటలకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రాయలసీమను ప్రపంచంలోనే అత్యుత్తమ హార్టికల్చర్ క్లస్టర్‌గా తీర్చిదిద్దుతామని, ‘పూర్వోదయ’ పథకం నిధులు ఇందుకు దోహదపడతాయని అన్నారు.

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు ఈ ఏడాది గేమ్ ఛేంజర్‌గా మారుతుందని, ఇది బయోసైన్స్‌లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని చంద్రబాబు తెలిపారు. 2019-24 మధ్య వారసత్వంగా వచ్చిన సమస్యలను పరిష్కరించుకుంటూ, కేంద్ర బడ్జెట్ అందించిన అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు మండలం పొన్నకల్ గ్రామం మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవం 27న ప్రారంభం
ప్రజలు కోర్కెలు తీర్చే పొన్నకల్ కాజా మినల్లా హుసైని ఉరుసు మహోత్సవాలు 27 నుంచి 29 వరకు ఉత్సవాలు...
By mahaboob basha 2025-12-17 09:58:34 0 343
Telangana
🌧️ గత 3 రోజులుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు – నగరం జలమయంగా మారింది
హైదరాబాద్‌ - గత మూడు రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నిరంతర...
By BMA ADMIN 2025-08-16 07:08:53 0 2K
Andhra Pradesh
స్మశాన వాటిక లు శుభ్రంగా ఉంచాలి : మున్సిపల్ కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  స్మశాన వాటికలు శుభ్రంగా ఉంచండి ⏩ నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-23 06:51:37 0 119
Business
In market 5kgs cylinder available
*మార్కెట్లోకి 5 కేజీల గ్యాస్ సిలిండర్..!!*    గ్యాస్ సిలిండర్ అంటే ఇప్పటివరకు 14.2...
By G k Nookala 2026-04-05 13:18:43 0 42
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com