హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|

0
125

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లోకి మార్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ సభ్యులు చేపట్టిన ఆందోళనకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కమిటీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

ఈ మేరకు సమస్యను వివరిస్తూ డిప్యూటీ కమిషనర్ (DC) కి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా పేద ప్రజల వివాహాలు, శుభకార్యాలు, మరియు ఇతర సామాజిక కార్యక్రమాలకు వేదికగా ఉన్న, ఈ కమ్యూనిటీ హాల్ ను యధావిధిగా కొనసాగించాలని వారు కోరారు. ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడికి మార్చడం వల్ల స్థానికులకు ఫంక్షన్ హాల్ సౌకర్యం దూరమవుతుందని, కావున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో.. అనిల్ కిషోర్, ప్రేమ్, అరుణ్, సెంథిల్, సెల్వరాజ్, రాజు, ముత్తు లక్ష్మి, విజయ్, రామానుజం, అముల్, సురేష్, మరియు ఇతర కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
రైలు ఢీ కొని చిరుతపులి మరణం !! కర్నూలు జిల్లా
కర్నూలు :  కర్నూలు జిల్లా ఆదోని మండలం లోని కుప్పగల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రైలు...
By Hari Krishna 2025-12-23 16:14:48 0 152
Andhra Pradesh
సైబర్ నేరాల గురించి హెచ్చరిక తస్మాత్ జాగ్రత్త
అందరికీ జాగ్రత్త 🚨   ఏలురు జిల్లా ఎస్పీ, శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపిఎస్, గారు సైబర్...
By Rajini Kumari 2025-12-25 10:44:28 0 224
Andhra Pradesh
జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని,...
By John Baji 2025-12-31 09:11:26 0 128
Andhra Pradesh
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*
తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి...
By Vadlamudi NagaVenkat 2026-03-16 07:52:59 0 495
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com