Lakshmi Deepika: లక్ష్మీదీపిక ‘డబుల్’ ధమాకా: తెలంగాణ తర్వాత ఏపీ గ్రూప్-1లోనూ స్టేట్ టాపర్!

0
31

రెండు రాష్ట్రాల్లోనూ మొదటి ర్యాంకు సాధించిన ఘనత

ఉస్మానియాలో ఎంబీబీఎస్.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్‌

 

కోచింగ్ లేకుండానే కొట్టిన లక్ష్మీదీపిక

తదుపరి లక్ష్యం సివిల్స్ అంటూ వెల్లడి

పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి. ఇటీవలే తెలంగాణ గ్రూప్-1 ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన ఆమె, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 ఫలితాల్లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. స్థానికేతర కోటాలో ఏపీ పరీక్ష రాసినప్పటికీ, తన ప్రతిభతో అక్కడ కూడా టాపర్‌గా నిలిచారు.

 

హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన లక్ష్మీదీపిక కుటుంబ నేపథ్యం అంతా ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడి ఉంది. తండ్రి కృష్ణది కోనసీమ జిల్లా అమలాపురం కాగా, తల్లి పద్మావతిది పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతం ఆమె తెలంగాణ గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికై శిక్షణలో ఉన్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే పోస్టు రావడంతో, ఎక్కడ కొనసాగాలనే విషయంపై ఆమె ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 

లక్ష్మీదీపిక విద్యాభ్యాసం అంతా మెరిటోరియస్‌గా సాగింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె, ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ వైపు అడుగులు వేశారు. గతంలో ఏపీలో ఎంపీడీవో పోస్టు వచ్చినప్పటికీ, తన లక్ష్యం కోసం ఆ ఉద్యోగంలో చేరలేదు. యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న క్రమంలోనే ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోకుండా, కేవలం సివిల్స్ ప్రిపరేషన్‌తోనే రెండు రాష్ట్రాల గ్రూప్-1 పరీక్షల్లో టాపర్‌గా నిలవడం విశేషం.

 

పరీక్షల సమయంలో రోజుకు ఆరు గంటలు మాత్రమే చదివినట్లు లక్ష్మీదీపిక తెలిపారు. గ్రూప్స్ పరీక్షల్లో ఆప్షనల్ సబ్జెక్టులు ఉండవు కాబట్టి జనరల్ స్టడీస్‌పై పట్టు సాధించడం తనకు కలిసి వచ్చిందని వివరించారు. ఇప్పటికే రెండుసార్లు సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఆమె, తన అంతిమ లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని స్పష్టం చేశారు. ఒకే అభ్యర్థి రెండు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలవడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

Search
Categories
Read More
Nagaland
Assam Rifles Public School Hosts Friendly Football Match in Medziphem |
Assam Rifles Public School, Medziphema, organized a friendly football match with SFS Higher...
By Pooja Patil 2025-09-16 06:48:20 0 125
Andhra Pradesh
కేసును చాకచక్యంగా ఛేదించిన వెదుళ్ళపల్లి పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
తక్కువ ధరకు బంగారం పేరిట పోలీసుల వేషంలో మోసం చేసిన ముఠా బాధితురాలి నుండి రూ.6,50,000/-...
By Gadiyapudi Narendra 2026-01-12 11:40:04 0 109
Andhra Pradesh
సరూర్ ఏ ఉర్దూ మహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేసినేని శివనాథ్
    ఉర్దూ భాష‌ను వృద్ధిలోకి తీసువ‌చ్చింది సీఎం చంద్ర‌బాబు ఒక్క‌డే...
By Rajini Kumari 2025-12-30 09:58:47 0 72
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:కల్లూరు లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరులో బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి...
By Kothuru Murali 2026-02-19 09:55:08 0 18
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com